Daily Roundup

పరాక్రమ్‌ దివస్‌

Published: January 22, 2026

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ముఖ్య వ్యక్తుల్లో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. భారతీయులందరూ ప్రేమతో ఈయన్ను నేతాజీ అని పిలుస్తారు. ...

సునీతా విలియమ్స్‌

Published: January 21, 2026

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (60) పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబరు 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. ...

233 ఏళ్ల కిందటి రామాయణం

Published: January 21, 2026

అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ...

మరో అయిదేళ్ల పాటు అటల్‌ పెన్షన్‌ యోజన

Published: January 21, 2026

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని (ఏపీవై) మరో అయిదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ...

మచెల్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

Published: January 21, 2026

మొజాంబిక్‌ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్‌... ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ...

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌

Published: January 20, 2026

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు....

యూపీలో ఏఐ హబ్‌

Published: January 20, 2026

గ్రీన్‌కో గ్రూపు వ్యవస్థాపకుల నేతృత్వంలోని ఏఎం గ్రూపు, ఉత్తర్‌ ప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో  1 గిగావాట్‌ సామర్థ్యంతో కర్బన రహిత, అధిక సామర్థ్యంతో కూడిన కృత్రిమమేధ (ఏఐ) కంప్యూటింగ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ...

‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదిక

Published: January 20, 2026

అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ...

త్రివిధ సజ్జ

Published: January 20, 2026

ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌), రాజస్థాన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వే పెర్ల్‌ మిల్లెట్‌ హైబ్రిడ్‌) రకాన్ని రూపొందించాయి....

తెలంగాణకు 6 కొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు

Published: January 20, 2026

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నగర్‌ వన్‌ యోజన పథకం కింద తెలంగాణకు కొత్తగా ఆరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు మంజూరయ్యాయి....

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

Published: January 19, 2026

ప్రజా జీవనానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితినే విపత్తు అంటారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ చర్యల ఫలితంగా ఇవి సంభవిస్తాయి. వీటి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగుతాయి...

జాతీయస్థాయి శాసన సదస్సులు

Published: January 19, 2026

జాతీయ స్థాయి శాసన సదస్సులు ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ఆధ్వర్యంలో 2026 జనవరి 19న లఖ్‌నవూలోని విధాన్‌ భవనంలో ప్రారంభమయ్యాయి....

ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)

Published: January 19, 2026

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 2026, జనవరి 19న ప్రాంభమైంది. దేశ విదేశాల నుంచి 3,000 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు....

ఆటకు సైనా వీడ్కోలు

Published: January 19, 2026

భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్‌ 2026, జనవరి 19న ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరింది. ...

చైనాలో మళ్లీ తగ్గిన జనాభా

Published: January 19, 2026

వరసగా నాలుగో సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. 2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో దాదాపు కోటి మేర ఈ తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలాఏళ్లపాటు అమలుచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు....

భారత్, యూఏఈ మెగా రక్షణ బంధం

Published: January 19, 2026

ప్రధాని నరేంద్ర మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ 2026, జనవరి 19న దిల్లీలో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ...

ఆక్స్‌ఫాం నివేదిక

Published: January 19, 2026

సాధారణ ప్రజానీకానికి రాజకీయ సాధికారత అందించడం ద్వారా ప్రగతి సాధించవచ్చనడానికి అద్భుత ఉదాహరణగా భారతదేశ రిజర్వేషన్‌ విధానం నిలిచిందని ‘‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌’’ సంస్థ పేర్కొంది....

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

Published: January 19, 2026

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధి రేటు వేగం ఇలాగే కొనసాగితే, తలసరి ఆదాయమూ గణనీయంగా పెరిగి.. 2030 నాటికి భారత్‌ ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది....

భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతం

Published: January 19, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా నమోదవ్వొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2025 అక్టోబరు అంచనాల్లో మన వృద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని చెప్పిన సంస్థ, 0.7% మేర పెంచింది. ...

విజయ్‌ హజారే

Published: January 18, 2026

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని విదర్భ తొలిసారి కైవసం చేసుకుంది. 2026, జనవరి 18న బెంగళూరులో జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. ...

రూ.1.84 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు

Published: January 18, 2026

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...

సియామ్‌ నివేదిక

Published: January 18, 2026

విదేశీ విపణిల్లో కార్లు, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు గిరాకీ పెరగడంతో.. 2025లో మనదేశం నుంచి 63,25,211 వాహనాలు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ తెలిపింది. ...

వందేభారత్‌ స్లీపర్‌ (ఏసీ) రైలు

Published: January 17, 2026

దేశంలోనే మొట్టమొదటిదిగా హావ్‌డా-గువాహటి మధ్య నడిచే వందేభారత్‌ స్లీపర్‌ (ఏసీ) రైలును ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 17న మాల్దా టౌన్‌ రైల్వేస్టేషన్లో ప్రారంభించారు....

విశాఖలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయం

Published: January 17, 2026

కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. విశాఖలో పోర్టులు, విమానాశ్రయం ఉండటంతో దేశవిదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ...

డబ్ల్యూఈఎఫ్‌ సర్వే

Published: January 17, 2026

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) దావోస్‌ ఆర్థిక సదస్సుకు ముందుగా ‘చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ అవుట్‌లుక్‌’ నివేదికను 2026, జనవరి 17న విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు 2026లో బలహీనంగా ఉంటాయని...

ఉగాండా అధ్యక్షునిగా ఏడోసారి ముసెవేని గెలుపు

Published: January 17, 2026

ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని ఏడోసారి దేశాధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 71.65 శాతం దక్కాయని ఆ దేశ ఎలక్షన్‌ కమిషన్‌ 2026, జనవరి 17న వెల్లడించింది. ...

ఏపీ ఐఏఎస్‌ కేడర్‌ బలం 239 నుంచి 259కి పెంపు

Published: January 17, 2026

ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ కేడర్‌ బలాన్ని 239 నుంచి 259కి పెంచుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2026, జనవరి 17న నోటిఫికేషన్‌ జారీచేసింది. ...

స్టార్టప్‌ ఇండియా

Published: January 16, 2026

ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 16న న్యూదిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ‘స్టార్టప్‌ ఇండియా’ పదో వార్షికోత్సవ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ...

ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి

Published: January 16, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ ప్రారంభమైందని పశ్చిమాసియా అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ప్రకటించిన కొద్ది సేపటికే తన నేతృత్వంలో మండలి ఏర్పాటైనట్లు ప్రకటించారు. ...

భారత 92వ గ్రాండ్‌మాస్టర్‌ 

Published: January 16, 2026

దిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్‌ వర్ష్‌నే గ్రాండ్‌మాస్టర్‌ హోదా సొంతం చేసుకున్న భారత 92వ ఆటగాడిగా నిలిచాడు. ...

నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ

Published: January 16, 2026

భారత నౌకాదళం తన శాటిలైట్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, అంతర్జాతీయ శాటిలైట్‌ సంస్థ వయాశాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది....

వందేమాతరం ఇతివృత్తంగా గణతంత్ర కవాతు

Published: January 16, 2026

వందేమాతర గీతం 150 ఏళ్ల పరిపూర్తి ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు ప్రధాన ఇతివృత్తం కానుంది....

రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026

Published: January 16, 2026

బ్యాంకులతో పాటు, ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ‘రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026’ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకురానుంది....

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ వశిష్ఠ

Published: January 16, 2026

కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) విజిలెన్స్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ మాజీ అధికారి ప్రవీణ్‌ వశిష్ఠ 2026, జనవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు....

‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’

Published: January 16, 2026

2024లో భారత్‌లో 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవించారని ఒక అధ్యయనం తేల్చింది....

2025-26లో భారత్‌ వృద్ధి 7.2%

Published: January 15, 2026

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది....

వికీపీయియాకు 25 ఏళ్లు

Published: January 15, 2026

అంతులేని సమాచార భాండాగారం వికీపీడియా ప్రారంభమై 2026, జనవరి 15నాటికి 25 ఏళ్లు పూర్తయ్యింది....

భారత సైనిక దినోత్సవం

Published: January 14, 2026

ఇండియన్‌ ఆర్మీ ప్రపంచంలోనే నాలుగో శక్తిమంతమైన సైన్యంగా గుర్తింపు పొందింది....

ఎన్‌ఐఏ డీజీగా రాకేశ్‌ అగర్వాల్‌ 

Published: January 14, 2026

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాకేశ్‌ అగర్వాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా 2026, జనవరి 14న నియమితులయ్యారు....

మస్కట్‌ చేరుకున్న ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య 

Published: January 14, 2026

నౌకాయాన రంగంలో భారత్‌ అరుదైన ఘనత సాధించింది. ...

‘జియోస్పేషియల్‌ వరల్డ్‌’ పురస్కారం

Published: January 14, 2026

ఐటీ, ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి జియోస్పేషియల్‌ వరల్డ్‌ నుంచి లివింగ్‌ లెజెండ్‌ పురస్కారం లభించింది....

భారత్‌ నుంచి చైనాకు పెరిగిన ఎగుమతులు

Published: January 14, 2026

భారత్‌ నుంచి చైనాకు 2024తో పోలిస్తే 2025లో 5.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.49,500 కోట్ల) ఎగుమతులు పెరిగాయని చైనాకు చెందిన కస్టమ్స్‌ విభాగం 2026, జనవరి 14న విడుదల చేసిన వార్షిక వాణిజ్య గణాంకాలు వెల్లడించాయి....

‘క్యాట్‌’ పరిధిలోకి బీబీనగర్, మంగళగిరి ఎయిమ్స్‌

Published: January 14, 2026

తెలంగాణలోని బీబీనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌ సహా దేశంలోని 16 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (సీఏటీ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ 2026, జనవరి 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది....

75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత 

Published: January 14, 2026

పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రభుత్వ 2026, జనవరి 14న ప్రకటించింది....

నాస్కామ్‌-ఇండీడ్‌ నివేదిక

Published: January 13, 2026

ప్రస్తుతం టెక్‌ సంస్థల్లో దాదాపు 40% పనులు కృత్రిమ మేధ (ఏఐ) నిర్వహిస్తున్నట్లు పరిశ్రమ సంఘం నాస్కామ్, ఇండీడ్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘వర్క్‌ రీ-ఇమాజిన్డ్‌- ది రైస్‌ ఆఫ్‌ హ్యూమన్‌-ఏఐ కొలాబరేషన్‌’ సర్వే తెలిపింది....

అర్థ, గణాంక శాఖ అంచనా

Published: January 13, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తెలంగాణలో ఖరీఫ్, రబీ పంట సీజన్లలో రికార్డు స్థాయిలో 2.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని భారత అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనా వేసింది. ...

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ కన్నుమూత

Published: January 13, 2026

ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ (96) 2026, జనవరి 13న హైదరాబాద్‌ గోషామహల్‌ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో కన్నుమూశారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. ...

మోదీతో ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భేటీ

Published: January 12, 2026

భారత్‌లో రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ 2026, జనవరి 12న అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇద్దరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, మహాత్ముడికి నివాళులర్పించారు. ...

2026-27లో వృద్ధి 7 శాతం

Published: January 12, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జీడీపీ వృద్ధి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో 7 శాతంగా నమోదుకావొచ్చని ఫిచ్‌ గ్రూప్‌ కంపెనీ బీఎంఐ అంచనా వేసింది. సానుకూల విధాన నిర్ణయాలు భారత్‌కు అండగా నిలవొచ్చని పేర్కొంది. ...

ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

Published: January 12, 2026

సైనికులు మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక క్షిపణికి సంబంధించిన కొత్త వెర్షన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహల్యనగర్‌లో ఉన్న ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. ...

మధుమేహంతో ఆర్థిక భారం

Published: January 12, 2026

మధుమేహం కారణంగా అధిక ఆర్థిక భారం పడుతోన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 16.5 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 11.4 లక్షల కోట్ల డాలర్లతో భారత్‌ ద్వితీయ స్థానంలో, 11 లక్షల కోట్ల డాలర్లతో చైనా తృతీయ స్థానంలో ఉంది. ...

ఆర్‌ఏఎస్‌ స్వర్ణ పతకం

Published: January 12, 2026

భారత సంతతికి చెందిన అమెరికన్‌ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ కులకర్ణికి బ్రిటిష్‌ రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ (ఆర్‌ఏఎస్‌) స్వర్ణ పతకాన్ని ప్రదానం చేసింది....

జాతీయ యువజన దినోత్సవం

Published: January 11, 2026

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకే ఉంది. దేశ ప్రగతిలో వీరి పాత్ర ఎనలేనిది. సమాజ హితం పట్ల యువకుల్లో స్ఫూర్తి నింపేలా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు....

గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఏపీ

Published: January 11, 2026

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ ‘గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (మహా హరిత కుడ్యం)’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ...

కేరళ

Published: January 11, 2026

కేరళలోని కన్నూర్‌ జిల్లా ఆరళంలో ఉన్న దేశంలోనే తొలి సీతాకోకచిలుకల అభయారణ్యం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 2025లో ఆరళం అభయారణ్యాన్ని సీతాకోకచిలుకల పెంపకం, వలసలకు ముఖ్యమైన ప్రదేశంగా గుర్తించాలని ప్రకటించింది....

అరుణాచల్‌ప్రదేశ్‌

Published: January 11, 2026

అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు కొత్తరకం కప్పలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని జీనస్‌ లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని, మెచుకాగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి కప్పలు 39 ఉండగా, వాటిలో నాలుగు భారత్‌లోనే ఉన్నాయి. ...

నళినీ జోషికి

Published: January 11, 2026

భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ నళినీ జోషికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో 2025కుగాను ప్రతిష్ఠాత్మక ‘న్యూ సౌత్‌వేల్స్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూ) సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ఆమెను వరించింది....

శ్రీలంకలో భారత్‌ నిర్మించిన బెయిలీ వంతెన ప్రారంభం

Published: January 11, 2026

భారత సహకారంతో శ్రీలంకలో నిర్మించిన మొదటి బెయిలీ వంతెన (తాత్కాలిక వంతెన)ను 2026, జనవరి 11న ప్రారంభించారు. సెంట్రల్‌ ప్రావిన్స్‌-ఉవా ప్రావిన్స్‌ మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న రహదారి అనుసంధానం 2025, నవంబరులో వచ్చిన దిత్వా తుపానుతో ధ్వంసమైంది....

ప్రపంచ హిందీ దినోత్సవం

Published: January 10, 2026

మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని కేవలం సంభాషణగానే కాకుండా తమ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. ...

ప్రపంచ టాప్‌-100 పోర్ట్‌ల్లో విశాఖ

Published: January 10, 2026

దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా, ప్రపంచంలో టాప్‌-100లో ఒకటిగా విశాఖ పోర్ట్‌ స్థానం దక్కించుకున్నట్లు కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ 2026, జనవరి 10న పేర్కొన్నారు....

‘ఔట్‌స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు’

Published: January 10, 2026

డెయిరీ రంగ అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ వీసీఎండీ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ‘ఔట్‌స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు-2025’ లభించింది. ...

అరుణాచల్‌లో కాగితం లాంటి పుట్టగొడుగులు

Published: January 10, 2026

సన్నగా కాగితంలా ఉండే ‘ప్లీటెడ్‌ ఇంక్‌క్యాప్‌’ పుట్టగొడుగులను అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్‌ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రం ఐసీఏఆర్‌-కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే)లో ఈ తరహా పుట్టగొడుగులను కనుకుకన్నారు....

పెరిగిన బియ్యం ఎగుమతులు

Published: January 10, 2026

2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంతో పోలిస్తే, ఇవి 19.4% అధికం. ...

వ్యవసాయంలో చరిత్రాత్మక వృద్ధి

Published: January 10, 2026

2014-15 నుంచి 2024-25 వరకు పదేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూలేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ సమయంలో వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసిందని, ఇది గతంలో ఎన్నడూ లేదని తెలిపింది. ...

ఆదిత్య-ఎల్‌1

Published: January 10, 2026

శక్తిమంతమైన సౌర తుపాన్ల కారణంగా.. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి  ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. ...

ప్రవాసీ భారతీయ దివస్‌

Published: January 9, 2026

భారతదేశంలో పుట్టి చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాల్లో స్థిరపడిన వారిని ప్రవాసులుగా పేర్కొంటారు. దేశాభివృద్ధిలో వీరి పాత్ర ఎనలేనిది. ...

2026లో భారత్‌ వృద్ధి రేటు 6.6%

Published: January 9, 2026

ఈ ఏడాది (2026)లో భారత వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదుకావొచ్చని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంచనా వేసింది. అమెరికా సుంకాల ప్రభావాన్ని స్థిరమైన ప్రైవేట్‌ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు భర్తీ చేస్తాయని తెలిపింది....

అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కారాలు

Published: January 9, 2026

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఏడుగురు అధికారులకు ‘అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌-2025’ లభించాయి. 2026, జనవరి 9న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయమంత్రి వి.సోమన్న, రైల్వే బోర్డు ఛైర్మన్‌ సతీష్‌కుమార్‌లు వీరికి ఈ అవార్డులు అందజేశారు....

నారీశక్తి పురస్కారం

Published: January 9, 2026

ప్రవాస భారతీయుల అభివృద్ధి, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రవాస తెలంగాణ మహిళ అబ్బగౌని నందినికి ఖతార్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం నారీశక్తి పురస్కారం లభించింది....

యాక్టివ్లీ కూల్డ్‌ స్క్రామ్‌జెట్‌ ఫుల్‌ స్కేల్‌ కంబస్టర్‌

Published: January 9, 2026

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌ అభివృద్ధి చేసిన ‘యాక్టివ్లీ కూల్డ్‌ స్క్రామ్‌జెట్‌ ఫుల్‌ స్కేల్‌ కంబస్టర్‌’ను డీఆర్‌డీఓ 2026, జనవరి 9న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్‌సోనిక్‌ క్షిపణులను అభివృద్ధి చేసే దిశలో ఇది కీలక ముందడుగు. ...

ఎన్‌ఐడీఎంఎస్‌

Published: January 9, 2026

నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్‌ ఐఈడీ డేటా మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎన్‌ఐడీఎంఎస్‌) ఫ్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 2026, జనవరి 9న ప్రారంభించారు....

భూ భ్రమణ దినోత్సవం

Published: January 8, 2026

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలిసిందే. సూర్యోదయం, సూర్యాస్తమయం; రాత్రి, పగళ్లు; రుతువుల్లో మార్పులు లాంటివి సంభవించడానికి భూ భ్రమణమే కారణం. ...

మాధవ్‌ గాడ్గిల్‌ కన్నుమూత

Published: January 8, 2026

పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ (83) 2025, జనవరి 8న పుణెలో మరణించారు. భారత పర్యావరణ పరిశోధన, పరిరక్షణ విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు....

‘రామ్‌జెట్‌’

Published: January 8, 2026

రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్‌ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటీ మద్రాస్‌ రూపొందించింది. మందుగుండుకు అమర్చే వినూత్న ఆర్టిలరీ షెల్‌ను ఆవిష్కరించింది....

పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌

Published: January 8, 2026

ఐఐటీ మద్రాస్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్‌ పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చింది. సీ-డాక్‌ రుద్ర సిరీస్‌ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుందని ఐఐటీ మద్రాస్‌ 2026, జనవరి 8న పేర్కొంది. ...

అమెరికా రక్షణశాఖకు రూ.135 లక్షల కోట్లు

Published: January 8, 2026

2027 ఆర్థిక సంవత్సరానికిగానూ సైనిక బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు....

దేశ వృద్ధి రేటు 7.4%

Published: January 7, 2026

గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2025-26లో వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కానుంది. ...

విద్యుత్‌ వాహనాల విక్రయాలు

Published: January 7, 2026

విద్యుత్‌ వాహన (ఈవీ) రిటెయిల్‌ అమ్మకాలు, 2025లో 22,70,107కు చేరాయి. 2024లో అమ్ముడైన  19.5 లక్షల ఈవీలతో పోలిస్తే, ఈ సంఖ్య 16.37% అధికమని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) పేర్కొంది. ...

జనాభా లెక్కల సేకరణ

Published: January 7, 2026

దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ-2027లో భాగంగా తొలి దశలో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గృహాలు, నిర్మాణాల జాబితాల తయారీ, వాటి నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు. ...

హరియాణాలో హైడ్రోజన్‌ రైలు

Published: January 6, 2026

భారత్‌లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును హరియాణా ప్రారంభించనుంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్‌-సోనిపత్‌ మధ్య నడుస్తుంది. ...

సాహిత్య సంపుటాలు విడుదల

Published: January 6, 2026

దేశంలోని వివిధ ప్రాచీన భాష అధ్యయన పీఠాలు ప్రచురించిన సాహిత్య సంపుటాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2026, జనవరి 6న దిల్లీలో విడుదల చేశారు....

‘భైరవ్‌’

Published: January 6, 2026

శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్‌’ పేరుతో కొత్తగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. లక్ష మందికి పైగా ‘డ్రోన్‌ ఆపరేటర్ల’తో ఈ భారీ మానవ సైన్యాన్ని తయారుచేసింది. ...

మిజోరంలో కొత్తరకం రెల్లుజాతి పాము

Published: January 6, 2026

రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఓ కొత్తరకం రెల్లు జాతి పామును గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని తెలిపారు. ...

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు పినాక ఆధునికీకరణ పనులు

Published: January 6, 2026

భారత సైన్యానికి చెందిన మొదటి తరం ‘పినాక మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌)’, బ్యాటరీ కమాండ్‌ పోస్టులను ఆధునికీకరించేందుకు, మరమ్మతులు చేసే పనులను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది....

ఏఈపీసీ ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్

Published: January 6, 2026

దుస్తుల ఎగుమతిదార్ల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్‌ 2026, జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. సుధీర్‌ సెఖ్రి స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. ...

2026-27లో భారత వృద్ధి 6.9%

Published: January 6, 2026

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.9% వృద్ధి చెందే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌-రా) అంచనా వేసింది. ...

మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా టౌడెరా

Published: January 6, 2026

మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌ దేశ అధ్యక్షుడిగా ఫస్టీన్‌ అర్చాంజ్‌ టౌడెరా మూడోసారి విజయం సాధించారు. 2025, డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో దాదాపు 76 శాతం ఓట్లతో ఆయన నెగ్గినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ...

మనోజ్‌ కొఠారి కన్నుమూత

Published: January 5, 2026

బిలియర్డ్స్‌ మాజీ ప్రపంచ ఛాంపియన్, 15 ఏళ్లుగా భారత జట్టు కోచ్‌గా ఉన్న మనోజ్‌ కొఠారి (67 ఏళ్లు) 2026, జనవరి 5న కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన ఆయన తమిళనాడు తిరునెల్వేలిలో మరణించారు. ...

కనకమేడల రవీంద్రకుమార్‌

Published: January 5, 2026

సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2026, జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ...

ఫార్మా ఎగుమతులు

Published: January 5, 2026

2024-25లో దేశీయ ఫార్మా ఎగుమతులు 9.4% వృద్ధితో సుమారు రూ.2.45 లక్షల కోట్ల (30.47 బిలియన్‌ డాలర్ల)కు చేరుకున్నాయని ఫార్మాస్యూటికల్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్‌) 2026, జనవరి 5న తెలిపింది. ...

జొహన్నెస్‌బర్గ్‌

Published: January 5, 2026

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో బోచాసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయ సముదాయంలో భారత యోగి, 18వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ...

‘సముద్ర ప్రతాప్‌’

Published: January 5, 2026

‘సముద్ర ప్రతాప్‌’ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జలప్రవేశం చేయించారు. గోవా షిప్‌యార్డ్‌లో 2026, జనవరి 5న ఈ కార్యక్రమం జరిగింది. కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2,500 కోట్లతో గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఈ నౌకను నిర్మించింది. ...

కార్బన్‌ డైఆక్సైడ్‌తో మిథనాల్‌ ఇంధనం ఉత్పత్తి

Published: January 5, 2026

కార్బన్‌ డైఆక్సైడ్‌ను మిథనాల్‌ ఇంధనంగా మార్చేందుకు ఉపయోగపడే ఫొటోకెటలిటిక్‌ పదార్థాన్ని గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సూర్యకాంతి సాయంతో ఈ చర్య జరుపుతుంది....

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

Published: January 4, 2026

మానవులు చూడటం ద్వారానే చదవడం, నేర్చుకోవడం చేస్తుంటారు. కళ్లతో పదాలను తెలుసుకుని రాస్తుంటారు. చేతి వేళ్ల స్పర్శతో అక్షరాలను గుర్తించడం దీని ప్రత్యేకత. ...

చరిత్ర సృష్టించిన ఏపీ జెన్‌కో

Published: January 4, 2026

ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థ ఏపీ జెన్‌కో 2025, జనవరి 4న థర్మల్‌ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్‌ ద్వారా 181 మెగావాట్లు.. మొత్తం 6,009 మెగావాట్లను ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించింది....

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌

Published: January 4, 2026

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్‌ 2025, జనవరి 4న బాధ్యతలు చేపట్టారు. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించారు. ...

బియ్యం ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం

Published: January 4, 2026

బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కినెట్టి భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 2026, జనవరి 4న వెల్లడించారు....

ప్రపంచ తెలుగు మహాసభ

Published: January 3, 2026

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 2026, జనవరి 3న ప్రారంభమమయ్యాయి. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు. ...

రాజస్థాన్‌ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి

Published: January 3, 2026

విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచడంతో పాటు పఠనాసక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ...

ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా డాక్టర్‌ రాజిరెడ్డి

Published: January 3, 2026

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ చాడ రాజిరెడ్డి బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా ఎన్నికయ్యారు....

అంతర్జాతీయ పూల ప్రదర్శన

Published: January 2, 2026

అహ్మదాబాద్‌లోని సబర్మతీ తీరాన 14వ అంతర్జాతీయ పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీనిని అహ్మదాబాద్‌ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ భారీ ప్రతిమ...

ఏప్రిల్‌లో ‘వీబీ జీ రామ్‌ జీ’

Published: January 2, 2026

2026, ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవికా మిషన్‌(గ్రామీణ)’ (వీబీ జీ రామ్‌ జీ) అమలులోకి రానుంది....

మహిళల హాకీ జట్టు కోచ్‌గా మరైన్‌

Published: January 2, 2026

భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా షూవర్డ్‌ మరైన్‌ (నెదర్లాండ్స్‌) మళ్లీ నియమితుడయ్యాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు మరైన్‌ కోచ్‌గా ఉన్నాడు. ...

ఈసీఎంఎస్‌

Published: January 2, 2026

ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్‌) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన 22 నూతన ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్స్‌-ఐటీ శాఖ 2025, జనవరి 2న తెలిపింది....

ఎగుమతిదార్లకు రూ.7,295 కోట్ల ప్యాకేజీ

Published: January 2, 2026

ఎగుమతిదార్లకు రుణాల లభ్యత మెరుగుపరచడానికి రూ.7,295 కోట్ల ఎగుమతుల తోడ్పాటు ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్ల వడ్డీ సబ్‌వెన్షన్‌ పథకంతో పాటు రూ.2,114 కోట్ల తనఖా తోడ్పాటు కూడా ఉంది....

చైనా అమ్ములపొదిలో అధునాతన యుద్ధనౌక

Published: January 2, 2026

చైనా తన నౌకాదళంలోకి మరింత మెరుగుపరిచిన మిసైల్‌ డిస్ట్రాయర్‌ను చేర్చింది. టైప్‌ 052డి తరగతికి చెందిన ఈ యుద్ధనౌకకు లౌడీ అని పేరు పెట్టారు. ఇందులో మెరుగైన రాడార్, ఆయుధ, నెట్‌వర్క్‌ వ్యవస్థలు ఉన్నాయి. ...

సఖీ సురక్ష

Published: January 2, 2026

పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ‘సఖీ సురక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాలతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ...

ప్రపంచ కుటుంబ దినోత్సవం

Published: January 1, 2026

ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహాన్నే కుటుంబంగా పేర్కొంటారు. వీరి మధ్య వైవాహిక, రక్తసంబంధాలు ఉంటాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది....

ఐఎండీ వార్షిక నివేదిక

Published: January 1, 2026

దేశంలో గతేడాది (2025)లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించిన వాతావరణ నివేదికను 2026, జనవరి 1న విడుదల చేసింది. ...

న్యూయార్క్‌ మేయర్‌గా సబ్‌వేలో మమ్దానీ ప్రమాణం

Published: January 1, 2026

అమెరికాలోని న్యూయార్క్‌  నగర 112వ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్‌ మమ్దానీ ప్రమాణం చేశారు. మాన్‌హట్టాన్‌లోని ఓ చారిత్రక సబ్‌వే స్టేషన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఖురాన్‌పై ప్రమాణం చేసి.. న్యూయార్క్‌లో తొలి ముస్లిం మేయర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ...

గణాంకాల శాఖ కొత్త లోగో

Published: January 1, 2026

గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) 2026, జనవరి 1న కొత్త లోగోను విడుదల చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. ...

పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను

Published: January 1, 2026

పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను)కి, అదనంగా ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. ఇది 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ...

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు

Published: January 1, 2026

దేశీయంగా 2025 డిసెంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబరు వసూళ్లయిన రూ.1.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ...

వాయుసేన వైస్‌ చీఫ్‌గా నగేశ్‌ కపూర్‌

Published: January 1, 2026

భారత వైమానికదళ ఉప అధిపతి (వైస్‌ చీఫ్‌)గా ఎయిర్‌ మార్షల్‌ నగేశ్‌ కపూర్‌ 2026, జనవరి 1న బాధ్యతలు చేపట్టారు.  పదవీ విరమణ చేసిన ఎయిర్‌ మార్షల్‌ నర్మదేశ్వర్‌ తివారీ స్థానంలో ఆయన వచ్చారు....

వరల్డ్‌ వెదర్‌ అట్రిబ్యూషన్‌ సంస్థ నివేదిక 

Published: December 31, 2025

2025లోనూ ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 157 ప్రకృతి వైపరీత్యాలు కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు వరల్డ్‌ వెదర్‌ అట్రిబ్యూషన్‌ సంస్థ నివేదిక పేర్కొంది....

‘జీవన్‌దాన్‌’

Published: December 31, 2025

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జీవన్‌దాన్‌’ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అవయవదానంలో ‘జీవన్‌దాన్‌’ సరికొత్త రికార్డు సృష్టించింది. ...

కాణిపాకం ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు

Published: December 31, 2025

భక్తులకు అందిస్తున్న సేవలకు గుర్తుగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు లభించింది. ...

ప్రళయ్‌ క్షిపణి పరీక్షల

Published: December 31, 2025

ఒడిశా తీరం నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి రెండు ప్రళయ్‌ మిసైళ్లను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రయోగించింది. ...

‘కౌశలం’

Published: December 30, 2025

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు వచ్చే నాలుగు నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్‌ అగ్రిగేటర్లకు వారధిలా ‘కౌశలం’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది....

ధ్రువ్‌-ఎన్‌జీ

Published: December 30, 2025

పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు 2025, డిసెంబరు 30న బెంగళూరులో పౌర హెలికాప్టర్‌ ధ్రువ్‌-ఎన్‌జీ (నెక్స్ట్‌ జనరేషన్‌)ను లాంఛనంగా ప్రారంభించారు. ...

ఖాలిదా జియా కన్నుమూత

Published: December 30, 2025

బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా సేవలందించిన బేగం ఖాలిదా జియా (80) 2025, డిసెంబరు 30న ఢాకాలో మరణించారు. ఆమె బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలు కూడా. ...

బ్లిట్జ్‌ టోర్నీ

Published: December 30, 2025

ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తెలంగాణ కుర్రాడు అర్జున్‌ ఇరిగేశి.. బ్లిట్జ్‌ విభాగంలోనూ కంచు పతకం నెగ్గి ‘డబుల్‌’ సాధించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ (2017) తర్వాత ఒకే టోర్నీలో రెండు విభాగాల్లో పతకాలు గెలిచిన ఘనత అర్జున్‌దే. ...

కామ్యా కార్తికేయన్‌

Published: December 30, 2025

స్కీయింగ్‌ చేస్తూ దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతిపిన్న భారతీయ వ్యక్తిగా కామ్యా కార్తికేయన్‌ (18 ఏళ్లు) ఘనత సాధించారు. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతను, ప్రచండ శీతల గాలులను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్‌ చేసింది. ...

ఇజ్రాయెల్‌ అత్యున్నత పౌర పురస్కారం

Published: December 30, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఆయనకు ‘ఇజ్రాయెల్‌ ప్రైజ్‌ ఫర్‌ పీస్‌’ను అందజేయనున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు....

మీరాకు డేమ్‌హుడ్‌ అవార్డు

Published: December 30, 2025

ప్రముఖ బ్రిటిష్‌ ఇండియన్‌ నటి మీరా సియాల్‌ (64)ను ప్రతిష్ఠాత్మక డేమ్‌హుడ్‌ అవార్డు వరించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్‌లో కింగ్‌ చార్లెస్‌-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. ...

పెరిగిన జిల్లాల సంఖ్య

Published: December 29, 2025

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు మరో రెండు జిల్లాలను చేరుస్తూ 2025, డిసెంబరు 29న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. ...

5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి

Published: December 29, 2025

అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్‌లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పేరిట భారత నౌకాదళంలో చేరిన ఈ తెరచాప పడవ.. 2025...

పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం

Published: December 29, 2025

దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ ‘పినాక’ తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. రాకెట్‌ 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి, పూర్తి సత్తాను చాటింది. ...

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌

Published: December 28, 2025

తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్‌ ఇరిగేశి ఫిడే ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన హంపి.. మూడో స్థానంలో నిలిచింది. ...

స్మృతి మంధాన

Published: December 28, 2025

మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2025, డిసెంబరు 28న శ్రీలంకతో నాలుగో టీ20లో ఆమె 80 పరుగులు చేసింది. ...

ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో ద్రౌపదీ ముర్ము ప్రయాణం

Published: December 28, 2025

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. ...

నౌకానిర్మాణ పథకాలు

Published: December 28, 2025

రూ.44,700 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్రధాన నౌకా నిర్మాణ పథకాలకు మార్గదర్శకాలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ...

52 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి

Published: December 28, 2025

సోయజ్‌-2.1బి అనే వాహక నౌక ద్వారా రష్యా 2025, డిసెంబరు 28న ఒకేసారి 52 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వోస్టోక్నీ స్పేస్‌పోర్టు నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్‌’ తెలిపింది. ...

అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం

Published: December 27, 2025

అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 27న ‘అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం’గా (International Day Of Epidemic Preparedness) నిర్వహిస్తారు....

పెరగనున్న సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం

Published: December 27, 2025

మనదేశంలో మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 356 గిగావాట్లు కాగా, 2025 నాటికి అది దాదాపు 475 గిగావాట్లకు విస్తరించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి....

భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలు జయశ్రీ

Published: December 27, 2025

భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సీఈఓల్లో జయశ్రీ ఉల్లాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. ‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2025’ ప్రకారం, అరిస్టా నెట్‌వర్క్స్‌ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌ ...

వినియోగదారులకు వరంగా మారిన 1915

Published: December 27, 2025

2025లో దేశవ్యాప్తంగా వినియోగదార్లకు మొత్తం మీద రూ.45 కోట్ల రిఫండ్‌లను రికవరీ చేయడంలో జాతీయ వినియోగదార్ల హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) సాయం చేసింది. 67,265 వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది....

మలేసియాలో సంస్కృత శాసనాలు

Published: December 27, 2025

మలేసియాలోని బుకిట్‌ కోరస్‌లో పురాతన సంస్కృత శాసనాలు లభ్యమయ్యాయి. అక్కడ తవ్వకాలు జరపగా బుద్ధుడి విగ్రహంతోపాటు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మూడు రాళ్లు దొరికాయి. వాటిపై సంస్కృత శాసనాలున్నాయి. ...

క్రిస్టియన్‌ ఎయిడ్‌ నివేదిక

Published: December 27, 2025

2025లో వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు, కరవు, తుపానులు మొదలైన వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని రష్యాకు చెందిన క్రిస్టియన్‌ ఎయిడ్‌ నివేదిక వెల్లడించింది. ...

పత్రికా పఠనం తప్పనిసరి

Published: December 26, 2025

విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ...

అగరబత్తీలకు కొత్త నాణ్యతా ప్రమాణాలు

Published: December 26, 2025

ప్రపంచంలోనే అత్యధికంగా అగరబత్తీలను తయారు చేస్తూ, ఎగుమతి చేస్తున్న మన దేశంలో, వీటి నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. ...

7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం

Published: December 26, 2025

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో కలిసి సీఎం చంద్రబాబు 2025, డిసెంబు 26న ప్రారంభించారు. ...

చైనా

Published: December 26, 2025

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగాన్ని చైనా 2025, డిసెంబరు 26న ప్రారంభించింది. ‘తియాన్షన్‌ షెంగ్లీ’గా దానికి నామకరణం చేశారు. ఈ సొరంగం పొడవు 22.13 కిలోమీటర్లు. ...

రాష్ట్రీయ బాల పురస్కార్‌

Published: December 26, 2025

వీర బాలదివస్‌ సందర్భంగా కేంద్ర మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ప్రకటించిన ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు అందుకున్నారు....

కోల్‌ ఇండియా సీఈఓగా సాయిరాం

Published: December 26, 2025

ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్న బి.సాయిరాంను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025, డిసెంబరు 26న ఆమోదం తెలిపింది....

ప్రపంచంలోకెల్లా అతిసూక్ష్మ, స్వతంత్ర రోబోల సృష్టి

Published: December 26, 2025

ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మ పరిమాణంలోని స్వతంత్ర రోబో ఆవిష్కృతమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్‌ యూనివర్సిటీల పరిశోధకులు దీన్ని సృష్టించారు. ...

సుపరిపాలన దినోత్సవం

Published: December 25, 2025

దేశంలో లేదా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నా, ప్రజలు సుఖ-శాంతులతో జీవించాలన్నా సమర్థవంతమైన పాలన అవసరం. దీని ద్వారానే పౌరులు మెరుగైన సేవలు పొందగలుగుతారు. ...

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సింధు

Published: December 25, 2025

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ (2026-29)గా ఎన్నికైంది. ఆమె బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా కూడా ఉంటుంది. సింధు 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్‌ ఇంటిగ్రిటీ రాయబారిగా ఉంటోంది....

‘ప్రేరణా స్థల్‌’

Published: December 25, 2025

మాజీ ప్రధాని వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా 2025, డిసెంబరు 25న ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించారు. కమలం ఆకారంలో నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించారు....

దేశంలో లక్షకు మించి పెట్రోల్‌ పంపులు

Published: December 25, 2025

2025, నవంబరు చివరికి దేశవ్యాప్తంగా 1,00,266 పెట్రోల్‌ పంపులున్నాయని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2015లో ఈ సంఖ్య 50,451 మాత్రమేనని వెల్లడించింది. ...

సంథాలీ భాషలో రాజ్యాంగం

Published: December 25, 2025

దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2025, డిసెంబరు 25న జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంథాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు....

ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం

Published: December 24, 2025

దేశ చరిత్రలో తొలిసారిగా 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. దేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’లో ఎల్‌వీఎం3 రాకెట్‌నే ఉపయోగించనున్నారు. ...

‘ఇండియాస్‌ ప్రోగ్రెస్‌ టువర్డ్స్‌ మలేరియా ఎలిమినేషన్‌’ నివేదిక

Published: December 24, 2025

దేశంలో 2015-24 మధ్య దశాబ్దకాలంలో మలేరియా కేసుల్లో 80 - 85 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ 2025, డిసెంబరు 24న విడుదల చేసిన ‘ఇండియాస్‌ ప్రోగ్రెస్‌ టువర్డ్స్‌ మలేరియా ఎలిమినేషన్‌’ నివేదిక వెల్లడించింది....

కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం

Published: December 24, 2025

ప్రభుత్వరంగ గనుల సంస్థ ఎన్‌ఎండీసీ అమెరికాలోని కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌తో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ప్రధానంగా మైనింగ్, మినరల్‌ ప్రాసెసింగ్, మెటలర్జీ, గనుల విభాగంలో ఏఐ/ఎంఎల్‌ (కృత్రిమమేధ/యాంత్రీకరణ)...

జాతీయ వినియోగదారుల దినోత్సవం

Published: December 23, 2025

వ్యక్తిగత, సామాజిక, కుటుంబ అవసరాల కోసం వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని వినియోగదారుడు అంటారు....

అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్‌

Published: December 23, 2025

సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2025, డిసెంబరు 23న నియమితులయ్యారు. ...

రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారాలు

Published: December 23, 2025

తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌-2025 అందుకున్నారు. 2025, డిసెంబరు 23న రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరు ఈ పురస్కారాలను స్వీకరించారు....

‘అయిలా’

Published: December 23, 2025

దిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తలు డెన్మార్క్, జర్మనీలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ‘ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌’ (అయిలా) అనే సరికొత్త కృత్రిమ మేధ పరికరాన్ని రూపొందించారు. ...

శ్రీలంకకు 45 కోట్ల డాలర్ల ప్యాకేజీ

Published: December 23, 2025

దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు భారత్‌ 45 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీలంక పునర్నిర్మాణానికి స్థిరమైన నిబద్ధతతో భారత్‌ ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. ...

సలహా కమిటీ

Published: December 23, 2025

ట్రాన్స్‌జెండర్లకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే అంశంపై పరిశీలించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆశామేనన్‌ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది....

వినోద్‌కుమార్‌ కన్నుమూత

Published: December 23, 2025

ప్రముఖ హిందీ రచయిత, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత వినోద్‌కుమార్‌ శుక్లా (88) 2025, డిసెంబరు 23న రాయ్‌పుర్‌లో మరణించారు. శుక్లా 1937 జనవరి 1న ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించారు....

కామన్వెల్త్‌ సభాధ్యక్షుల సదస్సు

Published: January 16, 2025

కామన్వెల్త్‌ దేశాల సభాధ్యక్షుల 28వ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 15న పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ప్రారంభించారు....

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram