దేశంలో వస్తు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, అమ్మకం కోసం విధించే పన్నును ఎక్సైజ్ సుంకం అంటారు. ఇది వస్తువుల తయారీదారులు భారత ప్రభుత్వానికి చెల్లించే పరోక్ష పన్ను. దేశంలో తయారైన వస్తువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక విస్తృత శ్రేణి ఎక్సైజ్ పన్నులు విలీనమయ్యాయి. అయితే పొగాకు, పెట్రోలియం ఉత్పత్తులు లాంటి కొన్నింటిపై మాత్రమే ఇది కొనసాగుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఈ పన్నుల నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సకాలంలో పన్ను చెల్లించాల్సిన ఆవశ్యకతను, దేశ ఆర్థిక వృద్ధిలో సీబీఐసీ పాత్రను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 24న ‘సెంట్రల్ ఎక్సైజ్ డే’గా నిర్వహిస్తారు. పన్నుల దాఖలు ప్రాముఖ్యతతోపాటు సుంకాల ఎగవేత వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
కేంద్ర ఎక్సైజ్ సుంకం
చారిత్రక నేపథ్యం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) కింది ఏ సంవత్సరంలో అధికారికంగా ఏర్పాటైంది?(ఆర్ఆర్బీ గ్రూప్ డి, 2022)
1) 1956 2) 1960 3) 1964 4) 1968
సమాధానం: 3
2. భారతదేశంలో ఏటా ఫిబ్రవరి 24న కింది ఏ దినోత్సవాన్ని జరుపుతారు?(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ 2025)
1) జాతీయ ఎక్సైజ్ దినోత్సవం
2) జాతీయ యువజన దినోత్సవం
3) జాతీయ సైన్స్ దినోత్సవం
4) జాతీయ ఓటర్ల దినోత్సవం
సమాధానం: 1
3.ఎక్సైజ్ సుంకాన్ని కింది దేనిపై విధిస్తారు?(ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, 2019)
1) వస్తువుల ఎగుమతి 2) వస్తువుల దిగుమతి
3) వస్తువుల అమ్మకం 4) వస్తువుల ఉత్పత్తి
సమాధానం: 4
4. _____________ is/are an item for which both, GST and central excise duty are applicable in India.(SSC CHSL Tier-I, 2023)
1) Alcohol for human consumption
2) Tobacco and tobacco products
3) Petroleum products
4) All the agricultural commodities
Answer: 2