భారత్‌లో పర్యావరణ పరిరక్షణ సంస్థలు

భారత్‌లో పర్యావరణ పరిరక్షణ సంస్థలు

భూమిపై సమస్త ప్రాణికోటి మనుగడకు పర్యావరణమే ఆధారం. ప్రతి జీవి ప్రకృతితో మమేకమై పరిసరాల నుంచి లభించే వనరుల ద్వారా జీవనాన్ని సాగిస్తుంది. అయితే జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, అధిక వ్యవసాయం లాంటి చర్యల ఫలితంగా పర్యావరణం క్షీణిస్తోంది. దీంతో ఆవరణ వ్యవస్థల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఆ ప్రభావం అన్ని జీవరాశులపై ఉంటోంది. ప్రధానంగా మానవ కార్యకలాపాల వల్లే జీవవైవిధ్య నష్టం, కాలుష్యం, వాతావరణ మార్పు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడమే ధ్యేయంగా వివిధ సంస్థలు పని చేస్తున్నాయి. పోటీ పరీక్షల కోణంలో వీటి గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

పర్యావరణ సంస్థల ఆవశ్యకత..

  • పర్యావరణ సంస్థలు దేశ పరిరక్షణ, సుస్థిరతలో ముఖ్య భూమిక పోషిస్తాయి. అటవీ నిర్మూలన, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం, వాతావరణ మార్పు లాంటి సమస్యల పరిష్కారానికి ఇవి ప్రభుత్వ, ప్రభుత్వేతర, కమ్యూనిటీ ఆధార సంస్థలతో కలిసి పనిచేస్తాయి.
  • మానవ కార్యకలాపాల వల్ల పరిసరాలకు జరిగిన నష్టం, వనరుల దోపిడీ లాంటివి అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టడం వాటి లక్ష్యం.
  • పర్యావరణ అనుకూల విధానాలు రూపొందించడం, అవగాహన పెంపొందించడం, క్షేత్ర స్థాయిలో అమలు చేయడం ద్వారా ఈ సంస్థలు ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న అంతరాన్ని పూరిస్తాయి. 

భారత్‌లో పర్యావరణ రక్షణ చర్యలు..

  •  పర్యావరణ కార్యక్రమాలు, విధానాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు, సమన్వయానికి, పర్యావరణ పరిరక్షణపై వివిధ మంత్రిత్వ శాఖలకు సలహా ఇవ్వడానికి భారత ప్రభుత్వం 1972లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో నేషనల్‌ కమిటీ ఆన్‌ ఎన్విరాన్మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ (ఎన్‌సీఈపీసీ)ని ఏర్పాటు చేసింది. దీని  ఛైర్మన్‌ పీతాంబర్‌ పంత్‌.
  • 1972 నాటి వన్యప్రాణి చట్టం, 1974 నాటి జల చట్టం లాంటి తొలి చట్టాల రూపకల్పనలో ఇది ముఖ్య భూమిక పోషించింది.
  • 1981లో ఎన్‌సీఈపీసీని ఎన్‌సీఈపీ (నేషనల్‌ కమిటీ ఆన్‌ ఎన్విరాన్మెంటల్‌ ప్లానింగ్‌)గా మార్చారు.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశంలో ఏర్పాటైన కొన్ని ముఖ్యమైన సంస్థలు:

  • ఆనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఏడబ్ల్యూబీఐ): ఇది ఒక చట్టబద్ధమైన సలహా మండలి. ఇది కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.దేశంలో జంతు సంరక్షణ కోసం పనిచేస్తోన్న అత్యంత ముఖ్యమైన సంస్థల్లో ఇది ఒకటి.  
  • సెంట్రల్‌ జూ అథారిటీ (సీజెడ్‌ఏ): ఇది కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.   దేశంలోని జంతు ప్రదర్శనశాలల్లో (జూలలో) ఉండే జంతువుల సంరక్షణ, నిర్వహణ కోసం కనీస ప్రమాణాలు, నిబంధనలు అమలు చేయడం దీని బాధ్యత.
  • వైల్డ్‌ లైఫ్‌ క్రైం కంట్రోల్‌ బ్యూరో (డబ్ల్యూసీసీబీ): దేశంలో వన్యప్రాణులపై దాడులు, స్మగ్లింగ్, వేట లాంటివి అడ్డుకునేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది.
  • సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ): ఇది లాభాపేక్ష లేని స్వచ్ఛంద పర్యావరణ పరిశోధనా సంస్థ. ఈ సంస్థే మొదటిసారిగా కోకో కోలా సింథటిక్‌ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది.  
  • వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూపీఎస్‌ఐ): ఇది భారతదేశంలోనే అత్యంత సమర్థ వన్యప్రాణి సంరక్షణ సంస్థ. జంతువుల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి సమాచారం అందించడం, వేటను నివారించడం లాంటి లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తుంది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఎక్కడ ఉంది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2016), (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైల్‌ వార్డర్, 2019),

(యూటీఈటీ, 2020), (యూపీహెచ్‌ఈఎస్‌సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (బీఈడీ), 2021),

(యూపీటీఈటీ, 2018),

1) నాగ్‌పుర్‌    2) గాంగ్‌టక్‌    3) దెహ్రాదూన్‌   4) ఇటానగర్‌

సమాధానం: 3

2. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)ని ఎప్పుడు స్థాపించారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2018)

1) 2011          2) 2010          3) 2008       4) 2009

సమాధానం: 2

3. Wildlife Crime Control Bureau (WCCB) is a statutory multi-disciplinary body under the Ministry of Environment, Forest and Climate Change (MoEF&CC). Its headquarters are in:
(SSC MTS, 2021),  (RRB NTPC, 2021)

1) New Delhi    2) Nagpur 3) Port Blair     4) Kolkata

Ans: 1

4. In the wake of the Stockholm Conference, the Government of India set up the National Committee on Environmental Planning and Coordination in the year
(WBCS Prelims 2017),  (MPSC Mains, 2019)

1) 1972          2) 1980          3) 1985          4) 1990

Ans: 1

5. It was emphasised by India that ‘The removal of poverty is an integral part of the goal of an environmental strategy for the world in ______

(MH SET Paper-II: Geography, 2019)

1) U.N. Conference on Human Environment at Stockholm, 1972

2) The Vienna Convention for the Protection of the Ozone Layer, 1985

3) Preparatory Committee Meeting, Geneva, 1991

4) U.N. Conference on Environment and Development, Nairobi, 1992

Ans: 1

6. Which of the following is considered as a land mark year in the history of legislative action in India for environment concerns during which National Committee for Environment Planning and Co-ordination (NCEPC) was set up?

(MPSC Prelims, 2014)

1) 1973          2) 1971          3) 1972          4) 1974

Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram