భారతదేశంలో ముఖ్యమైన టన్నెల్స్‌

భారతదేశంలో ముఖ్యమైన టన్నెల్స్‌

ఒక ప్రదేశంలోని కొండలు, లోయలు లాంటి భౌగోళిక సవాళ్లను అధిగమించి అభివృద్ధి చేసుకున్న మౌలిక సదుపాయాలే టన్నెల్స్‌ (సొరంగాలు). ఇవి మారుమూల ప్రాంతాల మధ్య రవాణాను అనుసంధానం చేయడంతోపాటు ప్రయాణ దూరాన్ని తగ్గిస్తాయి. ఈ ప్రాజెక్టులు దేశంలో రవాణా ముఖచిత్రాన్ని మార్చడంతోపాటు రక్షణ అవసరాలను తీర్చడంలోనూ ముందున్నాయి. ఆధునిక ఇంజినీరింగ్, వినూత్న ప్రణాళికలతో నిర్మించిన ఈ టన్నెళ్లు ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత, ప్రాంతీయ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయి. భారత్‌లో ముఖ్యమైన సొరంగాలను పరిశీలిస్తే..

అటల్‌ టన్నెల్‌

  • హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో ఉంది. 9.02 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గంగా పేరొందింది. దీని వెడల్పు 10.5 మీటర్లు. ఇందులో 8 మీ. వెడల్పుతో రోడ్డు నిర్మించారు.
  • దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2020, అక్టోబరు 3న ప్రారంభించారు.
  • ఇది ఏడాది పొడవునా మనాలీని లాహౌల్‌-స్పితి లోయతో కలిపి ఉంచుతుంది.
  • బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) దీన్ని నిర్మించింది.

పీర్‌ పంజల్‌ రైల్వే సొరంగం

  • దీన్ని బనిహాల్‌ రైల్వే టన్నెల్‌ అని కూడా అంటారు. ఇది 11.2 కి.మీ. పొడవుతో భారత్‌లోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగంగా ఉంది.
  • 2013, జూన్‌ 26న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దీన్ని ప్రారంభించారు.
  • ఇది ఉధంపూర్‌ - శ్రీనగర్‌ 6 బారాముల్లా రైల్‌ లింక్‌ (యూఎస్‌బీఆర్‌ఎల్‌)లో అంతర్భాగం.
  • ఇది వ్యూహాత్మక రక్షణ, లాజిస్టిక్స్‌లో కీలకపాత్ర పోషిస్తుంది.

డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ టన్నెల్‌

  • జమ్మూ-కశ్మీర్‌లోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)-44పై ఉంది. గతంలో చెనాని-నష్రీ సొరంగం అని పిలిచేవారు. దీన్ని పొడవు 9.28 కి.మీ. భారతదేశంలో పొడవైన హైవే సొరంగంగా ఇది నిలిచింది.
  • 2017, ఏప్రిల్‌ 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
  • ఇది ప్రాంతీయ వాణిజ్యం, పర్యాటకంతోపాటు హిమాలయ ప్రాంతంలో వ్యూహాత్మక సైనిక రక్షణ అందిస్తుంది.

చంబా సొరంగం

  • చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్టులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని చంబాలో నేషనల్‌ హైవే (ఎన్‌హెచ్‌)-94 పై రిషికేశ్‌-ధారాసు మార్గంలో ఏర్పాటు చేశారు.
  • పొడవు 440 మీ.
  • దీన్ని 2020, మే 26న ప్రారంభించారు.

సేలా సొరంగ మార్గం

  • అస్సాంలోని తేజ్‌పుర్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమెంగ్‌ జిల్లాతో కలిపేలా సేలా సొరంగ మార్గాన్ని నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2024, మార్చి 9న ప్రారంభించారు.
  • దీని నిర్మాణ వ్యయం రూ.825 కోట్లు. భారత్‌-చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగమైన అటల్‌ టన్నెల్‌ మనాలిని కింది దేనితో కలుపుతుంది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2022)

1) కులు   2) శిమ్లా   3) జమ్మూ  4) లాహౌల్‌-స్పితి

సమాధానం: 4

2. కింది వాటిలో భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం ఏది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2016)

1) నాటువాడి సొరంగం  2) పీర్‌ పంజాల్‌ సొరంగం

3) కర్బుడే సొరంగం    4) బెర్దేవాడి సొరంగం

సమాధానం: 2

3. As per Ministry of Road Transport and Highways, what is the total length of National Highways in India as of November 2022?
(SSC MTS, 2024)
1) 1,85,633 kilometres          2) 1,45,897 kilometres
3) 1,86,908 kilometres          4) 1,44,634 kilometres
Ans: 4
4. Atal Tunnel is across which one of the following Himalayan ranges?
(Agniveer Vayu (Group Y) 02/2026, 2025)
1) Zanskar          2) Western Pir Panjal
3) Ladakh           4) Eastern Pir Panjal
Ans: 4

 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram