రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

ఏ దేశంలోనైనా కేంద్ర బ్యాంక్‌ అనేది అత్యున్నత ఆర్థిక సంస్థగా పనిచేస్తుంది. ఇది దేశంలోని బ్యాంకింగ్, విత్తవ్యవస్థలను నియంత్రిస్తుంది. భారత్‌లో ఆ పనిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్వహిస్తుంది. అంతేకాకుండా కరెన్సీ నోట్లు ముద్రించి, వాటి విలువకు చట్టబద్ధమైన భరోసా ఇస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఆధారంగా ఉంటుంది. విదేశీ మారక నిల్వలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా రూపాయి విలువను కాపాడుతుంది. ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు నిర్మించి, దేశ ప్రగతికి అవసరమైన విధానాలను రూపొందిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోన్న ఆర్‌బీఐను 1935, ఏప్రిల్‌ 1న నెలకొల్పారు. ఈ సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో దీని గురించి ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!

ఆర్‌బీఐ ఏర్పాటు ఇలా..

  • భారతదేశంలో ద్రవ్య వ్యవస్థను పరిశీలించే ఉద్దేశంతో బ్రిటిష్‌ ప్రభుత్వం 1926లో ఎడ్వర్డ్‌ హిల్టన్‌ యంగ్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దీన్నే ‘హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌’ లేదా రాయల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కరెన్సీ అండ్‌ ఫైనాన్స్‌ అంటారు. దేశంలో కరెన్సీ, రుణాన్ని స్వతంత్రంగా నిర్వహించేందుకు ఒక కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇది సిఫార్సు చేసింది.
  • 1931లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్‌ బ్యాంకింగ్‌ ఎంక్వైరీ కమిటీ కూడా ఇదే సూచించింది.
  • ఫలితంగా 1934 రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం ఆమోదం పొంది, దీనికి చట్టబద్ధమైన గుర్తింపు, అధికారం వచ్చింది.
  • 1935, ఏప్రిల్‌ 1న కలకత్తాలోని తాత్కాలిక కార్యాలయంలో రూ.5 కోట్ల మూలధనంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభమైంది. 1937లో ఆర్‌బీఐ శాశ్వత కార్యాలయం కలకత్తా నుంచి ముంబయికి మారింది. 1949, జనవరి 1న ఆర్‌బీఐని ప్రభుత్వం జాతీయం చేసింది.

ఆర్‌బీఐ స్వరూపం

  • ఆర్‌బీఐ వ్యవహారాలను సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్వహిస్తుంది. ఆర్‌బీఐ చట్టం - 1934 ప్రకారం, భారత ప్రభుత్వం ఈ బోర్డును నియమిస్తుంది.
  • ఆర్‌బీఐలో మొత్తం 21మంది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఉంటారు. వారు: గవర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లు, ఇద్దరు ఆర్థికశాఖ ప్రతినిధులు (ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ, విత్తసేవల సెక్రటరీ), 10 మంది ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు, ప్రాంతీయ బోర్డులకు ప్రాతినిధ్యం వహించే నలుగురు డైరెక్టర్లు.
  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు గవర్నర్‌ నేతృత్వం వహిస్తారు.
  • ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా ఉన్నారు (2024, డిసెంబరు 11 నుంచి 2026, ఏప్రిల్‌ 1 నాటికి).

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..

1. హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కింది దేన్ని నెలకొల్పారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1, 2023)

1) సెబీ  2) ఆర్‌బీఐ  3) ఎస్‌బీఐ  4) నాబార్డ్‌

సమాధానం: 2

2. ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్‌ ఎవరు (2025లో)?

(అగ్నివీర్‌ ఆర్మీ జీడీ, 2025),(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)

1) రఘురామ్‌ రాజన్‌          2) ఉర్జిత్‌ పటేల్‌

3) సంజయ్‌ మల్హోత్ర      4) శక్తికాంత దాస్‌

సమాధానం: 3

3. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)ని కింది ఏ సంవత్సరంలో జాతీయం చేశారు?

(డబ్ల్యూబీసీఎస్‌ మెయిన్స్, 2023),(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2024)

1) 1935          2) 1956          3) 1949          4) 1961

సమాధానం: 3

4. The Reserve Bank was established in 1935 by the Banking Regulation Act, 1934 with a capital of ? ________.
(SSC MTS, 2019)
1) Rs. 2 crores          2) Rs. 4 crores 
3) Rs. 5 crores          4) Rs. 3 crores 
Ans: 3
5. The Reserve Bank of India was set up on the basis of the recommendation of which of the following commissions ?
(CRPF Head Constable Ministerial, 2023), 
(MP Police Constable 2023)
1) Hilton Young Commission          2) Sapru Commission
3) Hatfield Commission          4) Whitley Commission
Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram