ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ 2026, ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ సీఎస్గా సేవలందించిన విజయానంద్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో సాయిప్రసాద్ నియమితులయ్యారు.
సాయిప్రసాద్ను జలవనరులు, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పోస్టుల్లోను (పూర్తి అదనపు బాధ్యత) కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.