ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ లిసా గిల్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టులో సీనియారిటీలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీచేసే నిర్ణయానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ 2026, ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ గిల్ సీజేగా నియమితులవుతారు. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.