భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ మీద ల్యాండ్ అయిన విమానాల సంఖ్య వెయ్యికి చేరడంతో సరికొత్త రికార్డు సాధించింది. ఈ విషయాన్ని 2026, మార్చి 3న నేవీ వర్గాలు తెలిపాయి. భారత బాహుబలిగా పేరుగాంచిన ఈ విమానవాహక నౌక 2022, సెప్టెంబరు 2న నౌకాదళంలో చేరింది. దీన్ని కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించింది.