భారత తీరగస్తీ అవసరాల నిమిత్తం ఆరు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్హెచ్), వర్టికల్ లాంచ్ మిసైల్స్ (వీఎల్ఎం) తయారీకి రెండు సంస్థలతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.5,083 కోట్ల విలువగల ఒప్పందాలను చేసుకుంది. ఈ రెండు ఒప్పంద పత్రాలపై రక్షణశాఖ కార్యదర్శి రాజేష్కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.
ఆరు ఏఎల్హెచ్ల కోసం రూ.2,901 కోట్ల విలువగల ఆర్డర్కు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో, వీఎల్ఎంల కోసం రూ.2,182 కోట్ల ఆర్డర్కు రష్యాకు చెందిన జేఎస్సీ రోసోబొరొన్ ఎక్స్పోర్ట్ ఫెడరేషన్తో ఒప్పందాలు కుదిరాయి.