ఉపాధ్యాయ దినోత్సవం

ఉపాధ్యాయ దినోత్సవం

విద్యార్థులు, సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం. చిన్నతనం నుంచే వారు విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, విలువలు, జ్ఞానం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబరు 5న మన దేశంలో ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (Teacher's Day) నిర్వహిస్తారు. మన జీవితాలకు మార్గదర్శిగా నిలిచే అమూల్యమైన గురువుల పాత్రను గుర్తుంచుకోవడంతోపాటు వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ విడుదల చేసిన యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈ+) నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 14.67 లక్షల పాఠశాలలు ఉన్నాయి. 1.03 కోట్ల ఉపాధ్యాయులు, 24.72 కోట్ల పాఠశాల విద్యార్థులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో సగటున ఏడుగురు ఉపాధ్యాయులు, 169 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 సిఫార్సు చేసిన 30 : 1 ప్రమాణానికి అనుగుణంగా ఉంది.
  • మాధ్యమిక స్థాయి (9-12 తరగతులు)లో బడి మానేసే వారి రేటు 2024-25లో 8.2% ఉండగా 2025-26లో 7 శాతానికి తగ్గింది. కంప్యూటర్లున్న పాఠశాలల సంఖ్య 69.9% కాగా, ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న పాఠశాలలు 67.4 శాతం. 95% పాఠశాలల్లో విద్యుత్, 99.5% బడుల్లో తాగునీరు, 98.5% స్కూల్స్‌లో బాలికల కోసం మరుగుదొడ్లు, 96.9% పాఠశాలల్లో చేతులు కడుక్కునే సదుపాయాలు, 90.5% వాటిలో గ్రంథాలయాలు ఉన్నాయి.
  • డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1921 నుంచి 1932 వరకు కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీ (1931-36), బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి (1939-48) వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేశారు. 1936-52 వరకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈస్టర్న్‌ రిలీజియన్‌ అండ్‌ ఎథిక్స్‌ స్పాల్డిండ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 1948లో యునెస్కో కార్యనిర్వాహక బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

చారిత్రక నేపథ్యం

రాధాకృష్ణన్‌ 1888, సెప్టెంబరు 5న అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో జన్మించారు. 1962లో ఆయన రాష్ట్రపతి అయ్యాక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు చాలామంది వచ్చారు. ఈ సందర్భంగా ఆ రోజును దేశంలోని ఉపాధ్యాయులను గౌరవించేందుకు అంకితం చేయాలని అభ్యర్థించారు. దీనికి స్పందించిన భారత ప్రభుత్వం సెప్టెంబరు 5ను ఏటా మన దేశంలో ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరపాలని తీర్మానించింది. 

సమగ్ర శిక్షా అభియాన్, దీక్షా ప్లాట్‌ఫాం, నిష్ఠ స్కీం, ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యలో చేపట్టిన సంస్కరణలు, నూతన కార్యక్రమాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ గ్రేడ్‌-3, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’లో  అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజున కిందివాటిలో దేన్ని జరుపుకుంటారు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2024)

1) రాజ్యాంగ దినోత్సవం     2) విద్యార్థుల దినోత్సవం

3) ఇంజినీర్ల దినోత్సవం     4) ఉపాధ్యాయ దినోత్సవం

సమాధానం: 4

2. భారతదేశంలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ టీచర్స్‌ అండ్‌ టీచింగ్‌ ఎవరి పేరు మీద ప్రారంభమైంది?

(జీఎస్‌ఈటీ, 2018)

1) పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ            2) పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ

3) పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ        4) పండిట్‌ రవిశంకర్‌

సమాధానం: 3

3. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ఎప్పుడు ఏర్పాటైంది?

(యూజీసీ నెట్, 2022)

1) 1992, ఆగస్టు 17                2) 1994, ఆగస్టు 17

3) 1995, ఆగస్టు 17                4) 1996, ఆగస్టు 17

సమాధానం: 3

4. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా ఏ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు?

(ఎస్‌ఎస్‌సీ సెలక్షన్‌ పోస్ట్, 2024)

1) 1954             2) 1951        3) 1952       4) 1950

సమాధానం: 3

5. What is the full form of 'DIKSHA'?
(UGC NET, 2023)
1) Digital Infrastructure for Knowledge Sharing    
2) District Institute for Knowledge Sharing
3) Data Information and Knowledge Sharing
4) Digital Institution for Knowledge Sharing
Ans: 1
6. NISHTHA stands for ____________
(SSC MTS, 2024)
1) National Initiative for School Heads' and Teachers' Holistic Assessment
2) National Inauguration for School Heads' and Teachers' Holistic Advancement
3) National Initiative for School Heads' and Teachers' Holistic Advancement
4) National Inauguration for School Heads' and Teachers' Holistic Assessment
Ans: 3
7. The first on-line NISHTHA programme has been launched by the Ministry of Human Resource Development in _______.
(RRB NTPC CBT-I, 2021)
1) Andhra Pradesh        2) Maharashtra        3) Delhi        4) Uttar Pradesh
Ans: 1
8. In India, Teachers' Day is celebrated annually on September 5 to mark the birthday of:
(SSC CGL, 2024)
1) A.P.J Abdul Kalam            2) Sardar Vallabhbhai Patel
3) Sarvepalli Radhakrishnan        4) Subash Chandra Bose
Ans: 3   

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram