క్విట్‌ ఇండియా ఉద్యమం

క్విట్‌ ఇండియా ఉద్యమం

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జాతికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత ఘట్టంగా ‘క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని’ పేర్కొంటారు. దీన్నే ‘ఆగస్టు క్రాంతి ఉద్యమం (August Kranti Movement)’గా పిలుస్తారు. ‘విజయమో వీర స్వర్గమో’ అంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఉత్తేజితులై, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. ఇది వలసవాద పాలనను అంతం చేసే సాధనంలా పనిచేసింది. సంపూర్ణ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రజలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దాని ఫలితంగానే అయిదేళ్లు తిరిగేసరికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఇంతటి మహోజ్జ్వలమైన క్విట్‌ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8న ప్రారంభమైంది. పోటీపరీక్షల కోణంలో ఉద్యమం నాటి ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!

  • 1939 సెప్టెంబరులో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ చురుగ్గా పాల్గొంది. బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలపై కూడా జపాన్‌ దాడులు ప్రారంభించింది. 1942, ఏప్రిల్‌ 6న విశాఖపట్నం, కాకినాడపై జపాన్‌ విమానాలు బాంబులు వేశాయి. ఇది జాతీయోద్యమకారుల్లో ఆందోళన రేకెత్తించింది. అదేసమయంలో భారత్‌లో పర్యటిస్తున్న స్టాఫర్డ్‌ క్రిప్స్, గాంధీజీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. యుద్ధ సమయంలో బ్రిటిష్‌వారు వ్యవహరించిన తీరు స్వదేశీయుల్లో ఆగ్రహావేశాలు కలిగించింది.
  • కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 1942, జులై 14న వార్దాలో సమావేశమై ఈ విషయాన్ని చర్చించి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమ తీర్మానాన్ని రూపొందించింది. 1942 ఆగస్టు 8న బొంబాయి గోవాలియా ట్యాంక్‌ మైదానంలో కాంగ్రెస్‌ నేతలతో గాంధీజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారంతా క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించారు. గాంధీ ‘డూ ఆర్‌ డై’ (సాధించు లేదా మరణించు) అనే నినాదంతో క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. 
  • క్విట్‌ ఇండియా ఉద్యమం రెండు దశల్లో సాగింది. 1942 ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు ఉన్న దశను సామూహిక ఉద్యమ దశగా పేర్కొంటారు. ఇది అహింసాయుతంగాజరిగింది. కార్మికులు సమ్మెలు చేయడం, గొలుసులు లాగి రైళ్లు ఆపడం, టికెట్‌ లేని ప్రయాణాలు చేయడం లాంటివి చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి, ఉప్పు తయారు చేయడం, పన్నుల నిరాకరణ, సైనికులను ఎంపిక చేసే కార్యాలయాల ముందు పికెటింగ్‌ లాంటివి చేపట్టారు. అయితే వీటిని ఆంగ్లేయిలు వెంటనే అణచివేశారు.
  • రెండో దశలో ప్రజలు గెరిల్లా తరహా పోరాటాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వ భవనాలు, రైళ్లు, పోస్టాఫీసులను తగులబెట్టడం; టెలిగ్రాఫ్‌ లైన్లను కత్తిరించడం లాంటివి చేశారు. ఈ దశలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. ‘థాన జలాదో’ (పోలీస్‌ స్టేషన్లను దగ్ధం చేయండి), ‘స్టేషన్‌ వూక్‌ దొ’ (రైల్వే స్టేషన్లను ధ్వంసం చేయండి) లాంటి నినాదాలతో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వమూ తీవ్ర స్థాయిలో ఆందోళనకారులపై విరుచుకుపడి, ప్రారంభమైన మూడు నెలల్లోనే ఉద్యమాన్ని అణగదొక్కింది.
  • క్విట్‌ ఇండియా ఉద్యమానికి మూలకారణమైన రెండో ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో 1945 నాటికి ముగిసింది. గాంధీ యుగంలో జరిగిన అత్యంత హింసాత్మక ఉద్యమంగా క్విట్‌ ఇండియా ఉద్యమం పేరొందింది. నాటి వైస్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌ గో ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమాన్ని 1857 తిరుగుబాటు తర్వాత అత్యంత భయంకరమైందిగా పేర్కొన్నారు. 

ఉద్యమ నేపథ్యం, బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలు, ఆంధ్రాలో, హైదరాబాద్‌ రాష్ట్రం (తెలంగాణ)లో క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిన తీరుతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కింది ఏ సంవత్సరంలో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ ఏఎస్‌ఓ, 2025), (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2021),

(సీజీపీఎస్సీ ప్రిలిమ్స్, 2024), (ఎస్‌ఎస్‌సీ జేఈ ఈఈ, 2021), 

(జే అండ్‌ కే పోలీస్‌ కానిస్టేబుల్, 2016)

1) 1935    2) 1945    3) 1940   4) 1942

సమాధానం: 4

2. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఉన్న మరొక పేరు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

1) ఆగస్టు క్రాంతి     2) సహాయ నిరాకరణ

3) శాసనోల్లంఘన     4) ఏదీకాదు

సమాధానం: 1

3. కింది ఏ కాంగ్రెస్‌ సమావేశంలో క్విట్‌ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు?

(ఎంపీపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 2022)

1) కరాచీ    2) లాహోర్‌    3) బొంబాయి   4) నాగ్‌పుర్‌

సమాధానం: 3

4. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని దేనికి ప్రతిస్పందనగా ప్రారంభించారు?

(యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్, 2013)

1) కేబినెట్‌ మిషన్‌ ప్రణాళిక            2) క్రిప్స్‌ ప్రతిపాదన

3) సైమన్‌ కమిషన్‌ నివేదిక            4) వేవెల్‌ ప్రణాళిక

సమాధానం: 2

5. By whom the 'Quit India’ resolution was moved in the Bombay Session of the Congress in the year 1942?  
(UPPSC Civil Service, 2013)
1) Jawaharlal Nehru        2) Narendra Deo
3) Rajendra Prasad            4) J.B. Kripalani
Ans: 1
6. Who described the Quit India Movement (1942) as by far the most serious rebellion since 1857? 
(WBCS Prelims, 2018)
1) Viceroy Lord Linlithgo    2) Franklin Roosevelt
3) Chiang Kai Shek        4) Winston Churchill 
Ans: 1
7. The Quit India Movement launched in 1942 was an important and decisive movement in the history of the Indian National Movement.
i. An important meeting took place in August 1942 at Gowalia Tank in Calcutta in this regard.
ii. A significant feature of Quit India Movement was the emergence of what came to be known as parallel governments in some parts of the country. The first one was proclaimed in Ballia, in east UP, in August 1942.
Select the correct answer using the codes given below.
(IB ACIO Grade II, 2021)
1) Neither i nor ii        2) Both i and ii        3) ii only        4) i only
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram