తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు

మన దేశ మూలవాసులుగా పరిగణించే అనేక జాతి, గిరిజన సమూహాలను సూచించేందుకు ‘ఆదివాసి’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. వీరిని భారతదేశ అసలైన నివాసితులుగా పరిగణిస్తారు. గిరిజనులకు ప్రత్యేక సంస్కృతులు, భాషలు, ఆచారాలు ఉన్నాయి. వీరు శతాబ్దాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి తమ ప్రాంతంలోని పర్యావరణం, వనరులపై లోతైన అవగాహన ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాగే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా మన సామాజిక, సాంస్కృతిక స్వరూపంలో గిరిజన తెగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీరు ఎక్కువగా అటవీ, కొండ, నదీ, మైదాన ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. 

  • భారత రాజ్యాంగంలో గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగలుగా (ఎస్టీ) పేర్కొన్నారు. ఆర్టికల్‌ 366(25) షెడ్యూల్డ్‌ తెగలను నిర్వచిస్తుంది. ఇలా పేర్కొన్న వర్గాలన్నింటినీ ఆర్టికల్‌ 342లో చేర్చారు. దీని ప్రకారం, షెడ్యూల్డ్‌ తెగలు లేదా గిరిజనులు అంటే గిరిజనుల్లోని కొన్ని తెగలు/ వర్గాలు లేదా అన్ని తెగలు/ వర్గాలు అని రాష్ట్రపతి ప్రకటించారు. వీరి అభ్యున్నతి కోసం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 7.5 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలో కేటాయించారు.
  • ఆర్టికల్‌ 330 ప్రకారం, షెడ్యూల్డ్‌ తెగలకు లోక్‌సభలో 47 స్థానాలు (మొత్తం 543 సీట్లలో); ఆంధ్రప్రదేశ్‌లో 7 (175), తెలంగాణలో 12 (119) అసెంబ్లీ స్థానాలను రిజర్వ్‌ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 705 గిరిజన తెగల్లో 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (అండమాన్‌-నికోబార్‌ దీవులు)లో 75 ప్రత్యేక దుర్బలత్వ గిరిజన తెగలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 5 గిరిజన తెగలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు

కోయ

వీరు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఉమ్మడి తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాల్లో; తెలంగాణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నివసిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోనూ వీరు కనిపిస్తారు. అడవులు, మైదానాలు, లోయల్లో నివసిస్తారు. వ్యవసాయం వీరి ప్రధానవృత్తి. పోడు, స్థిర వ్యవసాయాలు చేస్తుంటారు. వీరు తమను తాము ‘కోయితుర్‌’ (Koithur) అని పిలుచుకుంటారు. 

కొండరెడ్లు

వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. అలాగే తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా పర్వత ప్రాంతంలో కనిపిస్తారు. వీరిది పితృస్వామ్య వ్యవస్థ. మాతృభాష తెలుగు. వివిధ అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తారు. పోడు వ్యవసాయం చేస్తారు. ఇళ్లను వృత్తాకారంలో నిర్మిస్తారు.  

సవర

వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటారు. వీరు ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లోనూ ఉన్నారు. ఈ తెగకు ఉన్న ఇతర పేర్లు: సౌరా, సోరా, సబరాలు. వీరి మాతృభాష సోరా. ఇది ముండారి భాషా వర్గానికి చెందింది. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. ఉద్యానవన సాగు, పోడు వ్యవసాయం చేస్తారు. కందులు, రాగులు, పప్పు ధాన్యాలు పండిస్తారు.

చెంచు

ఏపీలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలోని నల్లమల కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. తెలంగాణలో నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో జీవిస్తారు. వీరు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. చెంచులను ప్రోటో ఆస్ట్రలాయిడ్‌ (Proto Australoid) సమూహంగా వర్గీకరించారు. వీరు తెలుగులోని వివిధ మాండలీకాలు మాట్లాడతారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. లోక్‌సభలో షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) కోసం కేటాయించిన స్థానాల సంఖ్య?

(ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (మెయిన్స్‌), 2025)

1) 47    2) 43

3) 49    4) 41

సమాధానం: 1

2. తెలంగాణలోని కింది ఏ జిల్లాలో మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎక్కువగా ఉంది?

(టీఎస్‌పీఎస్సీ ఏఈ, 2015)

1) ఖమ్మం         2) ఆదిలాబాద్‌

3) మహబూబాబాద్‌   4) వరంగల్‌

సమాధానం: 3

3. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 342 కింది దేనికి సంబంధించింది?

(యూపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2021)

1) షెడ్యూల్డ్‌ కులాలు             2) వెనుకబడిన తరగతులు

3) షెడ్యూల్డ్‌ తెగలు             4) షెడ్యూల్డ్‌ ప్రాంతాలు

సమాధానం: 3

4. చెంచు తెగ భారతదేశంలో కింది ఏ రాష్ట్రానికి చెందింది?

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020)

1) పశ్చిమ బెంగాల్‌     2) తెలంగాణ

3) నాగాలాండ్‌        4) కేరళ

సమాధానం: 2

5. According to the Ministry of Tribal Affairs, how many Scheduled Tribes are notified under Article 342 of the Constitution of India as of December 2022?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Over 730        2) Over 530        3) Over 630         4) Over 430
Ans: 1
6. The Constitution (Scheduled Castes and Scheduled Tribes) Orders (Second Amendment) Bill, 2022 is applicable to:
(SSC CHSL Exam Tier-I, 2023)
1) Uttar Pradesh        2) Madhya Pradesh        3) Rajasthan            4) Bihar
Ans: 1
7. Which amongst the following states /UTs has not identified tribal community?
(Allahabad High Court ARO, 2021)
1) Chhattisgarh        2) Haryana            3) Maharashtra        4) Karnataka
Ans: 2
8. Which of the following tribes was included in the list of Scheduled Tribes in Andhra Pradesh under the Constitution (Scheduled Tribes) Order (Amendment) Bill, 2024? 
(RPF Constable, 2025)
1) Galong            2) Momba            3) Bondo Porja        4) Abor
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram