అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఒకరు. 21వ శతాబ్దంలో దేశ స్థితిగతుల్లో మార్పు తెచ్చి ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ పరంగా అభివృద్ధి చెందేలా భారత్‌ ప్రగతి పథంలో సాగడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వాజ్‌పేయీ కేవలం రాజకీయ నాయకుడే కాదు - కవి, గొప్ప మానవతావాది కూడా. అయిదేళ్లు పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్ర సృష్టించారు. మూడుసార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించి, తాను నమ్మిన సిద్ధాంతాలకు చివరిదాకా కట్టుబడి ఉన్నారు. ఆగస్టు 16న వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం!

  • అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 1924 డిసెంబరు 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. రాష్ట్రధర్మ (హిందీ మాసపత్రిక), పాంచజన్య (హిందీ వారపత్రిక); స్వదేశ్, వీర్‌ అర్జున్‌ దినపత్రికలకు అటల్‌ సంపాదకత్వం వహించారు. వాజ్‌పేయీ గొప్ప రచయిత కూడా. ‘మేరీ సంసదియా యాత్ర’, ‘మేరీ ఏక్యావాన్‌ కవితాయెన్‌’, ‘సంకల్ప్‌ కాల్‌’, ‘శక్తి-సే-శాంతి’ లాంటి రచనలు చేశారు. ‘ఫోర్‌ డికేడ్స్‌ ఇన్‌ పార్లమెంట్‌’, ‘లోక్‌సభ మే అటల్‌జీ’, ‘అమర్‌ బలిదాన్‌’, ‘న్యూ డెసిషన్స్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఫారిన్‌ పాలసీ’ లాంటి పుస్తకాలు రాశారు. 
  • విద్యార్థి దశ నుంచే అటల్‌లో జాతీయవాద భావాలు అధికంగా ఉండేవి. ఆ ప్రభావం వల్లే ఆయన 1939లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)లో చేరారు. దాంతోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్‌ కార్యదర్శి బాధ్యతలను వాజ్‌పేయీ చేపట్టారు. 1968 - 1972 మధ్య జనసంఘ్‌ అధ్యక్షుడిగా సేవలందించారు. 1957లో తొలిసారిగా వాజ్‌పేయీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మధుర, బలరాంపుర్‌ల నుంచి లోక్‌సభకు పోటీ చేసి, బలరాంపుర్‌లో గెలిచారు. 
  • వాజ్‌పేయీ 5 దశాబ్దాలపాటు ఎంపీగా కొనసాగారు. రాజ్యసభకు రెండుసార్లు (1962, 1986) ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీలో జనసంఘ్‌ విలీనమయ్యాక, మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో 1977 మార్చి 24 నుంచి 1979 జులై 28 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో వాజ్‌పేయీ హిందీలో ప్రసంగించారు. అక్కడ హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఆయనే.
  • వాజ్‌పేయీ బలమైన లౌకికవాది. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తదితర కాంగ్రెస్‌ దిగ్గజ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్‌’ నినాదానికి వాజ్‌పేయీ ‘జై విజ్ఞాన్‌’ను జోడించారు. అటల్‌ సేవలకు గుర్తింపుగా ఏటా ఆయన జయంతి రోజైన డిసెంబరు 25ను మన దేశంలో ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఆయన 2018, ఆగస్టు 16న దిల్లీలో మరణించారు. 
ప్రధానిగా వాజ్‌పేయీ పని చేసిన కాలం, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలు, పురస్కారాలతోపాటు గతంలో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-4, తెలంగాణ హైకోర్ట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్, ఏపీ పోలీస్‌ ఎస్‌ఐ, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్,  ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 1977లో కింది ఏ సంస్థలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నిలిచారు?
(ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2025)

1) ఐక్యరాజ్యసమితి సాధారణ సభ

2) ఉత్తర అట్లాంటిక్‌ ఒప్పంద సంస్థ (నాటో)

3) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)

4) వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)

సమాధానం: 1

2. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఎప్పుడు జన్మించారు?
(ఎంపీటెట్‌ వీఏఆర్‌జీ 2, 2023)

1) 1924, డిసెంబరు 25           2) 1920, నవంబరు 12

3) 1922, ఆగస్టు 16              4) 1923, డిసెంబరు 22

సమాధానం: 1

3. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ భారతదేశ ప్రధానిగా ఎన్నిసార్లు పనిచేశారు?
(ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2025)

1) 3      2) 1       3) 0           4) 2

సమాధానం: 1

4. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఎక్కడ జన్మించారు?
(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారీ కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023)

1) భోపాల్‌                 2) ఇందౌర్‌

3) గ్వాలియర్‌               4) జబల్‌పూర్‌

సమాధానం: 3

5. In which year did Atal Bihari Vajpayee undertake a bus journey to Lahore to sign a Peace Declaration?
(SSC CGL Tier-I, 2021)

1) 1991        2) 1997        3) 1994        4) 1999

Ans: 4

6. In which year the National Commission to Review the Working of the Constitution was set up by the government resolution?
(UP Police SI, 2021)

1) 2000        2) 2001        3) 2003        4) 1999

Ans: 1

7. Who among the following has NOT received 'Bharat Ratna'?
(SSC MTS, 2019)

1) Sachin Tendulkar        2) Atal Bihari Vajpayee

3) Pt. Jawaharlal Nehru        4) Mahatma Gandhi

Ans: 4

8. In India, 'Good Governance Day' is observed on the birthday of:
(FCI AG III, 2023)

1) Jawaharlal Nehru        2) Indira Gandhi            3) Atal Bihari Vajpayee    

4) Sardar Vallabhbhai Patel    5) None of the above

Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram