పర్యావరణ పరిరక్షణలో అత్యంత కీలకమైన రాబందుల సంఖ్య గత రెండున్నర దశాబ్దాలుగా గణనీయంగా తగ్గిపోతోందని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) బయాలజిస్ట్ ఎం.రవికాంత్ చేసిన పరిశోధనలో తెలింది. దేశంలో 2000-2010 మధ్యలోనే 90 శాతం వరకు మృతి చెందాయి. ఎక్కువగా.. నొప్పి నివారణ మందులు వేసిన పశువులు చనిపోయినపుడు వాటిని తిన్న రాబందులు వ్యాధులకు గురై మృతి చెందినట్లు ఆయన గుర్తించారు.
రాబందుల సంరక్షణ అత్యవసరంగా మారిన క్రమంలో.. రాబందుల మనుగడ, సంఖ్యను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చేసిన పరిశోధనకు గాను రవికాంత్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.