వాతావరణ మార్పుల వల్ల భారతదేశంలో ఏటా 61 శాతం మంది పిల్లలు, అంటే 14.5 కోట్ల మంది, అదనంగా ఒక నెలపాటు అధిక వేడి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. బెల్జియంలోని వ్రైజే విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ఈ అంశాన్ని వెల్లడించింది. వాతావరణ మార్పుల కారణంగా ఏటా కనీసం అయిదు నెలల పాటు ప్రమాదకరమైన వేడి ఒత్తిడికి గురవుతున్న తొమ్మిదేళ్లు, అంతకు లోపు వయసు పిల్లల సంఖ్య రెట్టింపు అయింది. ఇది 5.9 కోట్ల నుంచి 1.18 కోట్లకు (50 శాతం మంది పిల్లలు) పెరిగింది. అధిక వేడి ప్రస్తుత, భావితరాలలో వివిధ వయస్సులవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మొట్టమొదటిసారి పరిశీలించారు.