భారత్‌లో మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

భారత్‌లో మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

మహిళల క్రికెట్లో తొలి ఛాంపియన్స్‌ ట్రోఫీని ఐసీసీ.. శ్రీలంక నుంచి భారత్‌కు తరలించింది. ముందు అనుకున్న ప్రకారం 2027లో జరిగే ఈ టోర్నీకి లంక ఆతిథ్యం ఇవ్వాలి. కానీ ఆ దేశ క్రికెట్‌ పాలనా సమస్యలతో సతమతమవుతుండటంతో టోర్నీని మరో దేశంలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలించిన ఐసీసీ చివరకు ఆతిథ్య హక్కులను ఇండియాకు అప్పగించింది.

  • 2027, ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముంబయి, వదోదరాలను వేదికలుగా ఖరారు చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram