బడుల్లో బాలబాలికలకు వేర్వేరుగా శౌచాలయాలు ఉండాలన్న ఆదేశం దేశంలో 77% మేర అమలవుతోందని, మిగిలినచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం 2026, సెప్టెంబరు 1న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలాంటివి 30,458 నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించింది. పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్లు సమకూర్చడాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రారంభించాయని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనానికి తెలిపింది.