విశాఖపట్నంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు

విశాఖపట్నంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసుల విచారణకు విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఐఏ చట్టం-2008లోని సెక్షన్‌ 11 ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాక విశాఖపట్నంలోని ప్రత్యేకకోర్టును ఎన్‌ఐఏ కేసుల ట్రయల్‌ కోర్టుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఎన్‌ఐఏ దర్యాప్తు చేసే నేరాల కేసులనే ఇది విచారిస్తుందని తెలిపింది. ఈ కోర్టు పరిధిలోకి ఆంధ్రప్రదేశ్‌ మొత్తం వస్తుందని పేర్కొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram