దేశరక్షణ, విపత్తుల నిర్వహణలో గేమ్ ఛేంజర్గా భావిస్తున్న అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ‘ఈఓఎస్-05’(జీశాట్-1ఏ) ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి 2026, సెప్టెంబరు 4న చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ ఉపగ్రహాన్ని కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
2021 ఆగస్టులో జీఎస్ఎల్వీ-ఎఫ్10(జీశాట్-1) ప్రయోగం విఫలమైంది. దీంతో మరింత మెరుగైన సాంకేతికతతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సంవత్సరంలో తొలి విజయాన్ని నమోదు చేశారు.