ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఎంకే వైను బప్పు

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్‌ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్‌ అధ్యక్షుడిగానూ పనిచేశారు


ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్‌ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్‌ (ఐఏయూ) అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఈయన కనుక్కున్న ‘విల్సన్‌-బప్పు ఎఫెక్ట్‌’ ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడిగా (father of modern Indian astronomy) పేరొందిన వైను బప్పు జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • పూర్తి పేరు మనాలి కల్లాత్‌ వైను బప్పు. 1927, ఆగస్టు 10న మద్రాస్‌లో జన్మించారు. తండ్రి కుకుజీ బప్పు హైదరాబాద్‌లోని నిజామియా అబ్జర్వేటరీలో ఖగోళ శాస్త్రవేత్తగా పనిచేసేవారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోనే పెరిగారు.
  • పాఠశాల విద్యను హైదరాబాద్‌లోని సెయింట్‌ అన్నీస్‌ కాన్వెంట్, ఇస్లామియా ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. తండ్రి ఖగోళ శాస్త్రవేత్త కావడంతో వైను బప్పు చిన్నతనం నుంచే ఆస్ట్రానమీపై మక్కువ పెంచుకున్నారు.
  • బీఎస్సీ చదివేందుకు 1942లో నిజాం కాలేజ్‌లో చేరారు. 1943, డిసెంబరులో సర్‌ సి.వి.రామన్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రసంగం ఇచ్చేందుకు వచ్చారు. దానికి బప్పు కూడా హాజరయ్యారు. రామన్‌ మాటలు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి.
  • ఖగోళశాస్త్రంపై తనకు ఉన్న ఇష్టంతో ఎక్కువగా తండ్రి పనిచేసే నిజామియా అబ్జర్వేటరీకి వెళ్లి, ఖగోళ విషయాలు తెలుసుకున్నారు. 1946లో గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకున్నారు. అదే ఏడాది చర నక్షత్రాలపై (variable stars) చేసిన పరిశోధనల ఆధారంగా తన మొదటి శాస్త్రీయ పత్రాన్ని ‘కరెంట్‌ సైన్స్‌’ పత్రికలో ప్రచురించారు.
  • తర్వాత నిజాం కాలేజీలోనే భౌతికశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ కొనసాగించారు. 1948లో రాత్రి సమయంలో గాలిలో మెరిసే కాంతి వర్ణపటానికి  (spectrum of night airglow) సంబంధించి ఒక పత్రాన్ని ప్రచురించారు. ఇందుకోసం ఆయన స్పెక్ట్రోగ్రాఫ్‌ను నిర్మించారు. 1949లో మాస్టర్స్‌ డిగ్రీ పట్టా అందుకున్నారు.
  • అదే ఏడాది హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదివేందుకు స్కాలర్‌షిప్‌ లభించింది. దాని సాయంతో అమెరికా వెళ్లి ఖగోళశాస్త్రంలో పీహెచ్‌డీలో చేరారు. అక్కడ ప్రముఖ డచ్‌-అమెరికన్‌ ఖగోళ శాస్త్రవేత్త డాక్డర్‌ బార్ట్‌ జాన్‌ బోక్‌ ఈయనకు మెంటార్‌గా ఉన్నారు. జాన్‌ బోక్‌ అప్పటికే పాలపుంత గెలాక్సీ నిర్మాణం, నక్షత్రాలపై పరిశోధనలు చేశారు.
  • 1952 భారత ప్రభుత్వం నైనిటాల్‌ సమీపంలోని మనోరా శిఖరం వద్ద ఒక అబ్జర్వేటరీని నిర్మించాలని భావించింది. దీని కోసం వైను బప్పు అధ్యక్షతన ఒక పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా అక్కడ 1955లో ఉత్తర్‌ ప్రదేశ్‌ స్టేట్‌ అబ్జర్వేటరీ (యూపీఎస్‌ఓ) ఏర్పాటైంది.  
  • 1971లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ) సంస్థను తమిళనాడులోని కావలూరులో స్థాపించారు. తర్వాత దీని ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు మార్చారు. ప్రస్తుతం కావలూరులో ఉన్న దాన్ని వైను బప్పు అబ్జర్వేటరీ అనే పేరుతో పిలుస్తున్నారు.  
  • 1971-73 కాలంలో ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా; 1980-82 మధ్య ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 

అవార్డులు - గౌరవాలు

  • 1949 ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ది పసిఫిక్‌ నుంచి ‘డొనోహ్యూ కామెట్‌ మెడల్‌’ అందుకున్నారు.
  • 1970లో భౌతికశాస్త్రంలో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ బహుమతి లభించింది.
  • 1979-82 కాలానికి అంతర్జాతీయ ఖగోళ యూనియన్‌ (ఐఏయూ) అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవి చేపట్టిన మొదటి భారతీయుడు ఈయనే.

చివరగా..

భారతదేశంలో ఖగోళశాస్త్ర అభివృద్ధికి వైను బప్పు ఎంతగానో కృషి చేశారు. జాతీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ శాస్త్రీయ సహకారాల్లో ముఖ్య భూమిక పోషించారు. ఆయన 1982, ఆగస్టు 19న జర్మనీలోని మ్యూనిచ్‌లో మరణించారు. బప్పు జ్ఞాపకార్థం ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ 1985లో వైను బప్పు స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఖగోళశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి దీన్ని అందిస్తారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2019)

1) ఇందౌర్‌          2) షిల్లాంగ్‌

3) నైనిటాల్‌        4) బెంగళూరు

సమాధానం: 4

2. కిందివారిలో ఐఎన్‌ఎస్‌ఏ వైను బప్పు స్మారక పురస్కారాన్ని పొందిన మొదటి వ్యక్తి ఎవరు?

(ఎన్‌బీఎస్‌ ల్యాబ్‌ అటెండెంట్, 2018)

1) విక్రమ్‌ విశాల్‌            2) ఎస్‌ వెంకట్రామన్‌

3) ఎస్‌ చంద్రశేఖర్‌        4) అసిమ్‌ పునియా

సమాధానం: 3

3. Researchers at which of the following institutes developed a low-cost star sensor for astronomy and small CubeSat class satellite missions in March 2023? 
(DDA Patwari, 2023)
1) Raman Research Institute, Bengaluru
2) Indian Institute of Science, Bengaluru
3) Indian Institute of Astrophysics (IIA), Bengaluru
4) Inter-University Centre for Astronomy and Astrophysics, Pune
Ans: 3
4. The work of the Great Trigonometrical Survey of India commenced at Madras on April 10, 1802 when a baseline measurement related to the Madras longitude was made. Currently that Madras Observatory is known by which name?
(UPSSSC PET, 2023)
1) School of Planning and Architecture
2) Indian Institute of Astrophysics 
3) Indian Institute of Space Science and Technology
4) Raman Research Institute
Ans: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram