బ్రిక్స్‌ సదస్సు 2026

బ్రిక్స్‌ సదస్సు 2026
  • బ్రిక్స్‌ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు దిల్లీలోని భారత మండపంలో 2026, సెప్టెంబరు 12న ప్రారంభమైంది. ప్రధాని మోదీతో పాటు చైనా అధినేత షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి, అబుధాబి యువరాజు మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ సహా పలువురు అగ్రనేతలు ఇందులో పాల్గొననున్నారు. మొత్తం 11 సభ్య దేశాల, 10 భాగస్వామ్య దేశాల నేతలు హాజరయ్యారు.

  • బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిలో.. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా 2024లో చేరాయి. మరుసటి ఏడాది (2025) ఇండోనేసియా కూడా సభ్యత్వం తీసుకుంది. బెలారస్, బొలీవియా, కజఖ్‌స్థాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియెత్నాం నిరుడు బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలుగా చేరాయి.

  • 2026 బ్రిక్స్‌ సదస్సుకు భారత్‌ అధ్యక్ష స్థానంలో ఉంది. తదుపరి సదస్సు వచ్చే ఏడాది (2027) చైనాలో జరగనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram