ఆర్టికల్‌ 370 అమలు నిలిపివేసిన రోజు

ఆర్టికల్‌ 370 అమలు నిలిపివేసిన రోజు

ఆర్టికల్‌ 370 అనేది భారత రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధన. ఇది కశ్మీర్‌ సంస్థానానికి (జమ్మూ-కశ్మీర్‌) స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. ఇది భారతదేశంలో మరే రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి లేని ప్రత్యేకతను ఆ ప్రాంతానికి అందించింది. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చర్చలు, వాదోపవాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అంతేకాకుండా ఇది జమ్మూ-కశ్మీర్‌పై గణనీయమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రభావాలకు కారణమైంది. చివరికి భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2019, ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ను రద్దు చేసి, తద్వారా జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించింది. పోటీపరీక్షల కోణంలో ఆర్టికల్‌ 370 చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ నిబంధనలు, అమలు - రద్దు మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం..!

  • భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి కశ్మీర్‌ సంస్థానం భౌగోళికంగా జమ్మూ, కశ్మీర్, గిల్గిత్, లద్దాఖ్‌ అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉండేది. 1947 నాటికి రాజా హరిసింగ్‌ సంస్థానాధీశుడిగా ఉన్నారు. మతపరంగా జమ్మూలో హిందువులు, కశ్మీర్‌ లోయలో ముస్లింలు, లద్దాఖ్‌లో బౌద్ధులు అధికంగా ఉండేవారు. 1947లో బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లాక కశ్మీర్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని రాజా హరిసింగ్‌ భావించారు.
  • చైనా, ఆఫ్గనిస్థాన్, కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకునే భౌగోళిక స్థానం కారణంగా కశ్మీర్‌ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు చాలా ముఖ్యమైంది. అదే సమయంలో కశ్మీర్‌ను తమ యూనియన్‌లో కలపాలని పాకిస్థాన్‌ హరిసింగ్‌పై ఒత్తిడి తెచ్చింది. దీనికి అంగీకరించలేదని కశ్మీర్‌పై అనేక ఆంక్షలు విధించింది. ఆహార పదార్థాల సరఫరాను నిలిపివేసింది. చివరగా 1947, అక్టోబరు 22న కశ్మీర్‌పై తమ సరిహద్దు సైన్యంతో ప్రత్యక్ష దాడికి పాల్పడింది.
  • పాక్‌ సైన్యాన్ని ఎదుర్కోవడానికి కశ్మీర్‌ రాజు డోగ్రా సైన్యాన్ని పంపగా, అందులోని ముస్లింలు తమ పై అధికారులను కాల్చిచంపి, పాకిస్థాన్‌ సైన్యంతో కలిసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజా హరిసింగ్‌ భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందాన్ని చేసుకుని, సహాయం కోరాడు. భారత యూనియన్‌లో కశ్మీర్‌ను విలీనం చేస్తేనే సైనిక సహాయం చేయడానికి వీలవుతుందని ప్రభుత్వం చెప్పడంతో హరిసింగ్‌ దానికి అంగీకరించాడు. దీంతో 1947, అక్టోబరు 26న కశ్మీర్‌ భారత్‌లో విలీనమైంది.
  • భారత సైన్యం విమానాల ద్వారా శ్రీనగర్‌ చేరుకుని పాక్‌ సైన్యాన్ని నిలువరించింది. కానీ అప్పటికే పాక్‌ కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ సమస్యలో యూఎన్‌ఓ జోక్యం చేసుకోవడంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (ఆజాద్‌ కశ్మీర్‌)ను ఇప్పటికీ భారత్‌ స్వాధీనం చేసుకోలేకపోయింది. భారత యూనియన్‌లో విలీనమైన కశ్మీర్‌లో రాజా హరిసింగ్‌ రాజప్రముఖ్‌గా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేత షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడింది.
  • విలీన సమయంలో రాజా హరిసింగ్‌ కొన్ని షరతులతో భారత్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇది జమ్మూ-కశ్మీర్‌కు గణనీయమైన స్వయంప్రతిపత్తిని నిలుపుకోవడానికి వీలు కల్పించింది. 1949 అక్టోబరు 17న రాజప్రతినిధిగా హరిసింగ్‌ కుమారుడు కరణ్‌సింగ్‌ ఉన్న సమయంలో కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యాంగంలోని 21వ భాగంలో ఆర్టికల్‌ 370ని చేర్చింది
  • 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయ్యింది. 1956లో జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే దీన్ని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది. ఇది ఆ రాష్ట్రానికి సొంత రాజ్యాంగాన్ని, జెండాని కలిగి ఉండేందుకు అనుమతిస్తూ, భారత పార్లమెంట్‌ శాసన అధికారాలను పరిమితం చేసింది. 
రాజ్యాంగ నిబంధనలు, ఆర్టికల్‌ 370 రద్దు, సుప్రీంకోర్టు తీర్పు, ఆర్టికల్‌ 370 వ్యవహారంలో కీలక పరిణామాలు, రద్దు ప్రభావం తదితర ముఖ్యాంశాలతోపాటు గతంలో తెలంగాణ హైకోర్ట్‌ జూనియర్‌ అసిస్టెంట్, టీఎస్‌పీఎస్‌సీ - స్టెనో, టైపిస్ట్‌ & జూనియర్‌ అసిస్టెంట్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్‌ లాంటి పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారత యూనియన్‌లో జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదాను భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్‌ కల్పించింది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ డీఓఈ పీఆర్‌టీ, 2022), (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023),

(యూకేపీఎస్సీ ప్రిలిమ్స్, 2016), (యూపీఆర్‌వీయూఎన్‌ఎల్‌ టీజీ 2 మెకానికల్‌ ఫిట్టర్‌ 2015)

1) ఆర్టికల్‌ 377                2) ఆర్టికల్‌ 380

3) ఆర్టికల్‌ 370                4) ఆర్టికల్‌ 386

సమాధానం: 3

2. జమ్మూ-కశ్మీర్‌ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

1) 1946, ఆగస్టు 15    2) 1947, ఆగస్టు 15

3) 1957, జనవరి 15    4) 1950, జనవరి 26

సమాధానం: 3

3. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370ని ఎవరు రూపొందించారు?

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020)

1) జవహర్‌లాల్‌ నెహ్రూ                2) రఘుబార్‌ దాస్‌

3) గోపాలస్వామి అయ్యంగార్‌              4) బి.ఆర్‌.అంబేడ్కర్‌

సమాధానం: 3

4. జమ్మూ - కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత రాజ్యాంగ సభ ఏ సంవత్సరంలో ఆమోదించింది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2021)

1) 1952    2) 1949   3) 1961   4)1950

సమాధానం: 2

5. Article 370 was abrogated from the Indian Constitution in -
(UGC NET Paper 2: Political Science, 2025)
1) March 2017        2) August 2019        3) November 2017        4) July 2018
Ans: 2
6. Article 370, which granted special status to Jammu and Kashmir, was abrogated by which constitutional mechanism?
(SSC CGL 2025)
1) Presidential Order under Article 370(3)
2) Amendment by Parliament under Article 368
3) Ordinance by the President
4) Order under Article 356
Ans: 1
7. Before its repeal in 2019, which of the following was the key feature of Article 370 that gave special status to Jammu and Kashmir?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Parliament required the consent of the state government to make laws on matters in the Union List for Jammu and Kashmir.
2) The provisions of the Directive Principles of State Policy were fully applicable in the state.
3) Jammu and Kashmir had no representation in the Lok Sabha.
4) Jammu and Kashmir could not be included in the First Schedule of the Constitution.
Ans: 1 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram