కొత్త జిల్లా పరిషత్తులు

కొత్త జిల్లా పరిషత్తులు
  • పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తుల (జడ్పీ)ను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజా పరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. జిల్లాల పరిపాలన వ్యవస్థకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

  • ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ 2026, సెప్టెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీల్లో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం సెప్టెంబరు 24తో ముగియనుంది. ఆ తర్వాతే నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram