కేంద్ర ప్రభుత్వ మానవ అవయవాల మార్పిడి (సవరణ) చట్టం-2011 నిబంధనలను ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచేందుకు 1995 నాటి రాష్ట్ర చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 2026, ఆగస్టు 19న ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో అవయవ మార్పిడి ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించటానికి, అవయవాల అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.