‘వీబీ జీరామ్జీ’ పథకానికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్గా రాష్ట్రస్థాయి కౌన్సిల్ ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్కల్యాణ్ వైస్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. రాష్ట్ర ఆర్థిక, రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ, గిరిజన, సాంఘిక, కార్మిక, స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రులు కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు.
ఉపాధి పనులకు హాజరవుతున్న శ్రామికుల హక్కుల సంరక్షణలో కౌన్సిల్ క్రియాశీలకంగా వ్యవహరించనుంది.