ఆంధ్రప్రదేశ్లో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 2,68,23,000 అని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంబానియా 2026 ఆగస్టు 12న లోక్సభలో తెలిపారు. 2022లో 2,72,16,706 మేర ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఆ మరుసటి సంవత్సరం నుంచి 2,68,23,000కు తగ్గిందని వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే సంఖ్య కొనసాగుతోందని చెప్పారు.