కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలు

కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మార్కాపురం, భీమవరం, నంద్యాల పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ) ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం సమీప యూడీఏ పరిధిలో కొంత ప్రాంతాన్ని విభజించి కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూడీఏల్లో చేర్చారు. విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం, కెమికల్, పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీకేపీసీపీఐఆర్‌)ని రద్దు చేసి దాని పరిధిలోని ప్రాంతాలను విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ), కాకికాడ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో చేర్చనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యూడీఏల సంఖ్య 23కు చేరనుంది. కొత్త జిల్లాల పరిధికి అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థలను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2026, ఆగస్టు 6న నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram