భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, ఆగస్టు 1న ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమవుతున్న తొలి అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమిది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఎగిరే చేప ఆకృతిలో విమానాశ్రయాన్ని నిర్మించారు.
టెర్మినల్ సీలింగ్ సంప్రదాయ ముగ్గులు, నాదస్వరం థీమ్తో రూపొందించారు. జీఎంఆర్ సంస్థ ప్రత్యేక శ్రద్ధతో.. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దింది.