యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2026, సెప్టెంబరు 15న ‘చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్టం-2007లోని సెక్షన్‌ 10ఏ’ కింద అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం, పెద్ద వ్యాపార సంస్థలకు రూ.2,000కు మించి చెల్లింపులు జరిపితే, రుసుములు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అయితే ఈ రుసుములు వ్యాపార సంస్థలకే వర్తిస్తాయి.

  • రూపే డెబిట్‌ కార్డులతో పాటు, రూ.2,000 లోపు జరిపే వ్యాపార లావాదేవీలను (పీ2ఎం) ఉచిత ఎలక్ట్రానిక్‌ సాధనాలుగా వర్గీకరించింది. వినియోగదారులు, వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టంగా ఆదేశించింది.

  • ఎంత మొత్తమైనా వ్యక్తిగత బదిలీలపై (ఒక వ్యక్తి నుంచి మరొకరికి- పీ2పీ) ఒక్క పైసా రుసుము పడదు. అంటే స్నేహితులు, బంధువులతో ఒక నెలలో ఎన్ని లావాదేవీలైనా ఉచితంగా చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితీ ఉండదు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram