దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచడానికి, స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేయడానికి రూ.62,500 కోట్ల ప్రోత్సాహకాలతో తలపెట్టిన మొబైల్్ ఫోన్ తయారీ పథకం (ఎంపీఎంఎస్) మార్గదర్శకాలను ప్రభుత్వం 2026, ఆగస్టు 21న విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
ఎంపీఎంఎస్ పథకాన్ని 2 విభాగాలుగా విభజించారు. మొబైల్ ఫోన్ల తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వడం ఒకటైతే, దేశీయ మొబైల్ బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం రెండోది.