2025-26లో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరగా, అందులో రూ.38,000 కోట్ల విలువైన ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. 2026, ఆగస్టు 1న ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షణ రంగ తయారీదారుల ఎంఎస్ఎంఈల ఫోరమ్ సదస్సు ఈ విషయాన్ని వెల్లడించింది.
హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారత రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈల పాత్రపై ప్రత్యేక నివేదికను విడుదల చేశారు.