భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. భారత్ తరఫునే కాక.. టెస్టు హోదా ఉన్న దేశాల నుంచి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2026, సెప్టెంబరు 17న దిల్లీలో జరిగిన చివరిదైన మూడో టీ20లో అఫ్గానిస్థాన్పై అతడు ఈ స్కోరు సాధించాడు.
మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 108 పరుగులు సాధించాడు. కేవలం బౌండరీలతోనే అతను 102 పరుగులు చేశాడు.