ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు. 2026, సెప్టెంబరు 13న సాల్టిలో (మెక్సికో)లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో పురుషుల రికర్వ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా అతడు ఘనత సాధించాడు.
అతను షూటాఫ్లో నకానిషి (జపాన్)పై విజయం సాధించాడు. నిర్ణీత వ్యవధిలో స్కోరు 5-5తో సమం కావడంతో షూటాఫ్ అనివార్యమైంది. అందులో ధీరజ్ 10 పాయింట్లు సాధించగా.. నకానిషి 9 పాయింట్లే రాబట్టాడు.