దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ దక్కించుకుంది. సౌత్ జోన్తో ఫైనల్ డ్రాగా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ విజేతగా నిలిచింది. దులీప్ ట్రోఫీ గెలుచుకోవడం ఈస్ట్కు ఇది మూడోసారి. చివరగా 2012-13వ సీజన్లో టైటిల్ సొంతం చేసుకుంది. అప్పుడు కూడా చెన్నైలోనే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతగా నిలిచింది.
తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులు చేసి.. ఆ తర్వాత సౌత్ను 336 పరుగులకే ఆలౌట్చేసి.. 372 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఈస్ట్ ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓవర్నైట్ స్కోరు 212/5తో చివరి రోజు (2026, సెప్టెంబరు 10) రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఈస్ట్ టీ విరామానికి ముందు 388/7 వద్ద డిక్లేర్ చేసింది.