టీ20ల్లో హర్మన్ప్రీత్ భారత జట్టుకు నాయకత్వం వహించిన మ్యాచ్ల సంఖ్య 150కి చేరింది. 2026, సెప్టెంబరు 5న పాకిస్థిన్తో జరిగిన ఆసియా కప్ లీగ్లో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మహిళల్లోనే కాదు, పురుషుల క్రికెట్లోనూ ఏ ప్లేయర్ ఇన్ని అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్గా వ్యవహరించలేదు. 87 మ్యాచ్ల్లో జట్టును గెలిపించి హర్మన్.. 57 మ్యాచ్లు ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.