భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచాడు. 2026, ఆగస్టు 7న సెయింట్ లూయిస్ (అమెరికా)లో జరిగిన ర్యాపిడ్లో 12 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్న ప్రజ్ఞానంద.. బ్లిట్జ్లో కేవలం ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకుని 18 రౌండ్లలో 11.5 పాయింట్లు సాధించాడు. మొత్తంగా 23.5 పాయింట్లతో భారత గ్రాండ్మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.