భారత టెస్టు జట్టులో పదేళ్ల పాటు ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా ఉన్న అజింక్య రహానె 2026, జులై 30న క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2026, మే 24న ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున దిల్లీ క్యాపిటల్స్పై ఆడిందే రహానె చివరి మ్యాచ్. ఆ మ్యాచ్లో 63 పరుగులు చేసిన 38 ఏళ్ల అజింక్య.. తర్వాత దేశవాళీల్లో కూడా బరిలోకి దిగలేదు.
2011 ఆగస్టు 31న మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20తో రహానె అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. అదే పర్యటనలో అతను వన్డే అరంగేట్రం కూడా చేశాడు. 2013లో ఆస్ట్రేలియాపై దిల్లీలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత ఆ ఫార్మాట్లోనే ఎక్కువ పేరు సంపాదించాడు. రహానె చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2023లో ఆడాడు.