కామన్వెల్త్ క్రీడల్లో 2026, జులై 30న భారత్ ఖాతాలో మరో స్వర్ణం, రెండు రజత పతకాలు చేరాయి. పారా పురుషుల 100మీ టీ47 పరుగులో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. గేమ్స్ రికార్డును నెలకొల్పుతూ అతడు 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని, అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ మహ్మద్ బసిల్ (10.83సె) రజత పతకం గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ సాంటోస్ (10.85సె) కాంస్యం సాధించాడు.
మరోవైపు లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ వరుసగా రెండు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుచుకున్న తొలి భారత aఅథ్లెట్గా అతడు రికార్డు సృష్టించాడు. రెగ్యులర్ క్రీడల పురుషుల లాంగ్ జంప్లో శ్రీశంకర్.. రెండో స్థానంలో నిలిచాడు. అతడు అత్యుత్తమంగా 8.09 మీటర్ల దూరం గెంతాడు.