మరాఠీ చిత్రం ‘గోంధల్’ 99వ ఆస్కార్ పురస్కారాలకు భారత్ తరఫున ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2026, సెప్టెంబరు 18న అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకలో ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఈ చిత్రం మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో చేసుకునే ఒక జానపద ప్రదర్శనకు సంబంధించిన కథ ఆధారంగా గోంధల్ రూపొందింది. ఈ చిత్రం 2025లో విడుదలైంది.