దేశంలో జనన, మరణాల నమోదులో జాప్యాన్ని నివారించేందుకు నిబంధనలు కఠినతరం చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టం 2026, అక్టోబరు 1 నుంచి అమలులోకి రానుందని భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన జనన, మరణాల నమోదు(సవరణ) బిల్లు-2026పై 2026, ఆగస్టులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేయడంతో చట్టంగా మారింది.