2026, అక్టోబరు 1 నుంచి ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్’ అమల్లోకి తెస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుత బ్యాంకింగ్ ధోరణులకు అనుగుణంగా బ్యాంకింగ్ రికార్డులను సాక్ష్యంగా వినియోగించుకోవడానికి ఒక ఆధునిక వ్యవస్థను తీసుకొచ్చే లక్ష్యంతో ఈ చట్టాన్ని రూపొందించారు. 2026, ఆగస్టులో దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.