యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు మొదలై 2026, ఆగస్టు 25 నాటికి పదేళుల పూర్తయ్యాయి. దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా నిలవడంతో పాటు, రియల్ టైం చెల్లింపులకు అంతర్జాతీయ ప్రమాణంగా యూపీఐ ఎదిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన యూపీఐ విలువ - పరిమాణం పరంగా అత్యద్భుత వృద్ధిని సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
2016 ఆగస్టు 25న మన దేశంలో యూపీఐ సేవలు మొదలయ్యాయి.