ఓడరేవులు, టర్మినళ్ల నుంచి భారీ పరిమాణంలో సరుకు రవాణాకు ఉపయోగపడే తొలి ‘డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటెయినర్ రైలు’ను ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు (జేఎన్పీటీ) నుంచి గుజరాత్లోని వడోదరా వరకు విజయవంతంగా నడిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కంటెయినర్ రైలు ఆగస్టు 21న జేఎన్పీటీ నుంచి బయలుదేరి, దేశ పశ్చిమప్రాంతంలో సరుకు రవాణాకు ప్రత్యేకించిన కారిడార్లో 422 కిలోమీటర్లు ప్రయాణించి వడోదరా చేరుకుంది.