జాతీయ జెండా ఆవిష్కరణ

జాతీయ జెండా ఆవిష్కరణ

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై 2026, ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీంతో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ (17సార్లు) తర్వాత అత్యధికంగా 13 సార్లు జాతీయ జెండాను ఎగరేసిన ఘనతను మోదీ సొంతం చేసుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని 75 నిమిషాలపాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ల నుంచి జెన్‌-జీదాకా అనేక అంశాలను ప్రస్తావించారు. 12ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. అగ్రదేశాల సరసన చేరటానికి.... భారత్‌ వ్యూహాత్మక, ఆర్థిక వృద్ధికి ఆయన ‘సప్తధార’ పేరుతో మార్గసూచీని ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram