టీవీ ఛానళ్ల ప్రసారాలలో గంటకు 12 నిమిషాల నిడివికి మించి వాణిజ్య ప్రకటనలు ఉండరాదన్న పరిమితిని కేంద్రం రద్దు చేసింది. ప్రసార రంగంలో చోటుచేసుకుంటున్న సమూల మార్పులను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో ఈ పరిమితిని విధించారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు-1994ను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తాజా నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.