అటల్ పింఛన్ యోజన (ఏపీవై) పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 మే వరకూ దేశవ్యాప్తంగా 9.10 కోట్ల మంది అందుఓ సభ్యులుగా చేరినట్లు కేంద్రం వెల్లడించింది. వీరు నెలనెలా కట్టిన చందా నిధులు రూ.54 వేల కోట్లకు చేరాయి. ఏ వృత్తిలో ఉన్న నిరుపేదలకైనా సరే ప్రతినెలా పింఛన్ వచ్చే పథకాన్ని అటల్ పింఛన్ యోజన (ఏపీవై) పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలుచేస్తోంది. 2015, మే 9న ప్రారంభమై జూన్ 1న కార్యరూపం దాల్చింది. స్వావలంబన్ యోజన స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో దీన్ని ప్రారంభించారు.
ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన తొలి ఏడాది 2015-16లో 7.23 లక్షల మంది నెలవారీ చందాదారులుగా చేరగా... 2024-25లో ఆ సంఖ్య 54.57 లక్షలకు చేరింది.