ఉత్తమ విదేశీ బోధకుడిగా హుస్నాబాద్‌ వాసికి పురస్కారం

ఉత్తమ విదేశీ బోధకుడిగా హుస్నాబాద్‌ వాసికి పురస్కారం

చైనాలో ఉత్తమ విదేశీ బోధకుడిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన డా.పొన్నం దేవేందర్‌ గుర్తింపు పొందారు. చైనాలోని కున్మింగ్‌ పట్టణంలోని యున్నన్‌ మిన్జు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న దేవేందర్‌ను 2025-26 సంవత్సరానికి గానూ ఉత్తమ విదేశీ బోధకుడిగా ఎంపిక చేశారు. సెప్టెంబరు 10న చైనీస్‌ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డును అందజేశారు. భారత కరెన్సీలో రూ.1.2 లక్షల నగదును అందించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram