భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇటీవల రూపొందించిన మ్యాన్-పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఎంపీ-ఏయూవీ) ప్రయోగం విజయవంతమైంది. విశాఖపట్నంలోని నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరెటరీ (ఎన్ఎస్టీఎల్)లో పరీక్షలను నిర్వహించి పనితీరును నిర్ధారించారు.
సముద్ర జలాల్లో నీటి అడుగు భాగాన ఉన్న శత్రుదేశాల క్షిపణులు, మందుపాతరలను శబ్ద తరంగాల సాంకేతికతతో ఎలాంటి మానవ సాయం లేకుండా గుర్తించడం, వర్గీకరించడం వీటి ప్రత్యేకత.