ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాలలో తిరిగే బద్రి పశు జాతిని సంరక్షించడంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ-జాతీయ పాడి పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రజ్ఞులు కీలక ముందడుగు వేశారు. కృత్రిమ గర్భధారణ (టెస్ట్ట్యూబ్ బేబీ) పద్ధతిని ఉపయోగించి ఆరోగ్యకరమైన ఆడ దూడను ఉత్పత్తి చేశారని 2026, సెప్టెంబరు 12న వ్యవసాయ శాఖ తెలిపింది.
చిన్నగా, దృఢంగా ఉండే బద్రి పశువుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపునిచ్చారు.