త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 1.10 లక్షల కోట్ల వ్యయంతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్-డీఏసీ) పలు కీలక ప్రతిపాదనలకు ప్రాథమిక ఆమోదం తెలిపింది.
భారత సైన్యం కోసం, రసాయన, జీవాయుధ, రేడియోలాజికల్, అణ్వస్త్ర (సీబీఆర్ఎన్) రెక్కీ వాహనాలు, హై మొబిలిటీ వాహనాలు, స్వయంచాలిత మందుపాతర వాహనాలు, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు (ఏఎల్హెచ్లు), ట్రాల్ ట్యాంకులు, సర్వత్ర వంతెన వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం లభించింది.